AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet: చమురు సంస్థలకు 22వేల కోట్ల గ్రాంట్‌.. రైల్వే ఉద్యోగులకు బోనస్‌.. కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలివే

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌ టైమ్ గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌న్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

Modi Cabinet: చమురు సంస్థలకు 22వేల కోట్ల గ్రాంట్‌.. రైల్వే ఉద్యోగులకు బోనస్‌.. కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలివే
Anurag Thakur
Basha Shek
|

Updated on: Oct 12, 2022 | 9:12 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందు కోసం మొత్తం 1,832 కోట్ల రూపాయలు కేటాయించారు. 11.27 లక్షల మందికి దీంతో లబ్ధి చేకూరుతుంది. కాగా ప్రయాణికులు, వస్తు రవాణా సేవలందించడంలో రైల్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రశంసించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేందుకు సహకరించారన్నారు. అలాగే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌ టైమ్ గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌న్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

అలాగే ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 వరకూ 15వ ఆర్థిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలవుతుందని సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రజలపై గ్యాస్‌ భారం ఎట్టి పరిస్థితుల్లో పడకూడదనేదే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లో దీన్‌దయాల్‌ పోర్ట్‌ విస్తరణకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో