AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Food In Train: ఈ ట్రైన్‌లో ప్రయాణించే వారికి మూడు పూటల ఉచిత భోజనం.. ఏ రూట్‌లో ప్రయాణిస్తుందో తెలుసా..?

భారతీయ రైల్వేలు నడుపుతున్న 12,000 కంటే ఎక్కువ రైళ్లలో ఒకే ఒక్క రైలులో ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. గత 29 సంవత్సరాలుగా ప్రయాణీకులకు ఈ రైలులో మూడు పూటల ఉచితంగానే ఆహారాన్ని అందిస్తున్నారని మీకు తెలుసా.? అది కూడా ఈ మార్గంలోని ఆరు స్టాప్‌లలో ఈ ప్రత్యేక సదుపాయం ఉంటుంది. ఇందులో అల్పాహారం, మధ్యాహ్నన భోజనం, రాత్రి భోజనం నుండి ప్రతిదీ ఉంటుంది.

Free Food In Train: ఈ ట్రైన్‌లో ప్రయాణించే వారికి మూడు పూటల ఉచిత భోజనం.. ఏ రూట్‌లో ప్రయాణిస్తుందో తెలుసా..?
Free Food On Rails
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2025 | 1:39 PM

Share

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ దాదాపు 2.5 కోట్ల మందిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళతాయి. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను తీసుకెళ్లడానికి వేల రైళ్లు అవసరమవుతాయి. కాబట్టి, ఇందుకోసం కోసం రైల్వేలు 13,452 రైళ్లను నిరంతరాయంగా నడుపుతున్నాయి. ఇందులో లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ రైళ్లు కూడా ఉన్నాయి. వీటి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. కానీ, ఈ వేల రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ఆహారం లభించే ఒకే ఒక్క రైలు ఉంది. అంటే ఈ రైలు మీకు ప్రయాణాన్ని ఆస్వాదించడమే కాకుండా, మార్గంలో ఉచిత అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కూడా అందిస్తుంది. అలాంటి రైలుకు సంబంధించిన పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం…

ఈ ప్రత్యేక రైలు దేశంలోని రెండు ప్రసిద్ధ మత ప్రదేశాల మధ్య నడుస్తుంది. భక్తులకు దర్శనం కల్పిస్తుంది. ఈ రైలులోని ప్రయాణీకులకు గత 29 సంవత్సరాలుగా ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. భారతీయ రైల్వేలు నడిపిస్తున్న ఈ రైలులో ప్రయాణీకులందరికీ ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ ఇందులో మాత్రం ఉచితంగానే భోజనం అందిస్తారు.

ఈ రైలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుంది?: మనం మాట్లాడుతున్న రైలు మహారాష్ట్రలోని నాందేడ్ నగరం నుండి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళుతుంది. ఈ రైలు పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ (12715). ఈ రైలు అమృత్‌సర్‌లోని పెద్ద మతపరమైన ప్రదేశం శ్రీ హర్మందర్ సాహిబ్ గురుద్వారా నుండి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాకు వెళుతుంది. 1708వ సంవత్సరంలో సిక్కుల 10వ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ నాందేడ్‌లో మరణించారు. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణిస్తుంది.

ఇవి కూడా చదవండి

6 ప్రదేశాలలో ఆహారాన్ని అందిస్తారు. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 2,000 కి.మీ దూరం ప్రయాణించి ఈ ప్రయాణంలో 39 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ సమయంలో 6 స్టాపులలో లంగర్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కాకుండా ఈ స్టాపులు భోపాల్, పర్భానీ, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడ. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి రైలు దాదాపు 33 గంటలు నడుస్తుంది.

ఆహార ఖర్చును ఎవరు భరిస్తారు? ఈ రైలు స్టాపులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులు హాయిగా ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. రైలులో ఆహార మెనూ మారుతూ ఉంటుంది. కానీ చాలా సార్లు మీకు కర్రీ-రైస్, చోలే, పప్పు, కిచ్డీ, బంగాళాదుంపలు-క్యాబేజీ లేదా ఇతర కూరగాయలు వడ్డిస్తారు. దీని ఖర్చును గురుద్వారాలు అందుకున్న విరాళాల ద్వారా భరిస్తారు. ఉచిత లంగర్‌ను ఆస్వాదించడానికి, ఈ రైలులో జనరల్ నుండి ఎసి బోగీల వరకు ప్రయాణికులు తమతో పాటు పాత్రలను తీసుకువెళతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us