Punjab: యువకుడిపై నలుగురు యువతుల గ్యాంగ్ రేప్.. మత్తు మందు చల్లి, కిడ్నాప్.. అంతే కాకుండా..
ఇప్పటి వరకు యువతులు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. పూటకొకచోట, రాత్రి , పగలు అనే తేడా లేకుండా మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు...
ఇప్పటి వరకు యువతులు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. పూటకొకచోట, రాత్రి , పగలు అనే తేడా లేకుండా మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా యథాలాపంగా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. కానీ ప్రస్తుతం ఓ వెరైటీ కేసు వెలుగులోకి వచ్చింది. నలుగురు యువతులు కలిసి ఓ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు చల్లి, కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించిన బాధితుడు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనపై జరిగిన దురాగతాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ చిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్నగరంలో ఈ ఘటన జరిగింది.
జలంధర్నగరంలోని కపుర్తలా రోడ్డులో ఓ యువకుడు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారులో వచ్చిన అమ్మాయిలు.. ఆ యువకుడిపై మత్తుమందు చల్లారు. అతడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన ఆ యువతులు ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టి, అత్యాచారం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అదే కారులో యువకుడిని ఎక్కించుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
ఉదయం స్పృహ వచ్చాక ఆ యువకుడు తనపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే ఓ వీడియో విడుదల చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో జలంధర్డీసీపీ జగన్మోహన్సింగ్స్పందించారు. తమ వద్దకు ఇలాంటి కేసు ఏదీ రాలేదని, ఏ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..