AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్లే తెలంగాణ నష్టపోయిందన్న సీఎం కేసీఆర్..

వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని..

CM KCR:  డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్లే తెలంగాణ నష్టపోయిందన్న సీఎం కేసీఆర్..
CM KCR
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2022 | 6:26 PM

Share

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయంచారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని నిర్ణయించారు.

తెలంగాణపై  మోదీ ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల తెలంగాణ రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ, ఐటీ దాడులను సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం