AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరువైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఈ రెండు దిగ్గజ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
India Dropped Catches Stats
Rakesh
|

Updated on: Mar 04, 2026 | 7:04 AM

Share

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరువైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఈ రెండు దిగ్గజ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక ఆందోళనకరమైన గణాంకం వెంటాడుతోంది. క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే పాత సామెత ఉంది. కానీ ప్రస్తుత టీమిండియా ఫీల్డింగ్ గణాంకాలు చూస్తుంటే అభిమానులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో పోలిస్తే భారత్ క్యాచులు వదిలేయడంలో చాలా ముందుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి భారత్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో నంబర్ వన్ జట్టే. కానీ ఫీల్డింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లాండ్ దరిదాపుల్లో కూడా భారత్ లేదు. గతేడాది జరిగినటువంటి ఆసియా కప్ 2025 నుంచి ఇప్పటివరకు జరిగిన టీ20 గణాంకాలను పరిశీలిస్తే ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడైంది. ఇంగ్లాండ్ జట్టుతో పోలిస్తే టీమిండియా ఏకంగా 25 క్యాచులు ఎక్కువగా మిస్ చేసింది. ఆసియా కప్ నుంచి ఇప్పటివరకు ఆడిన 28 టీ20 మ్యాచ్‌లలో భారత్ 132 క్యాచులు అందుకున్నప్పటికీ, 42 సులభమైన క్యాచులను నేలపాల్జేసింది. అంటే భారత క్యాచింగ్ సామర్థ్యం కేవలం 75.8 శాతంగానే ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఇదే సమయంలో 98 క్యాచులు పట్టి, కేవలం 17 మాత్రమే వదిలేసింది. వారి క్యాచింగ్ సక్సెస్ రేటు 84.5 శాతంగా ఉంది. ఈ డిఫరెన్సే సెమీఫైనల్లో రిజల్ట్ తారుమారు చేసే ప్రమాదం ఉంది.

మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో పాల్గొన్న మొత్తం 20 జట్లలోనూ అత్యధిక క్యాచులు వదిలేసిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మన ఫీల్డర్లు 17 క్యాచులను జారవిడిచారు. శ్రీలంక 11 క్యాచులతో రెండో స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా 10 క్యాచులు వదిలేసి మూడో స్థానంలో ఉంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లలో బట్లర్, సాల్ట్ లేదా లివింగ్‌స్టోన్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లకు ఒక్క ఛాన్స్ ఇచ్చినా వారు మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకుంటారు. గ్రూప్ స్టేజ్, సూపర్-8లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ అదరగొట్టినప్పటికీ, ఫీల్డింగ్ లోపాలు మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి.

వాంఖడే స్టేడియం చిన్నది కావడం, ఇక్కడ బౌండరీల వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రతి పరుగు, ప్రతి క్యాచ్ చాలా విలువైంది. ఇంగ్లాండ్ జట్టు క్షేత్రస్థాయిలో చాలా చురుగ్గా ఉంటుంది. వారి ఫీల్డింగ్ ప్రమాణాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద వారి అథ్లెటిసిజం భారత్‌కు సవాలుగా మారనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే కేవలం బ్యాటుతో, బంతితో రాణిస్తే సరిపోదు.. గాలిలో వచ్చే బంతిని ఒడిసి పట్టుకోవాలి. చేతుల్లోకి వచ్చిన లడ్డూల్లాంటి క్యాచులను వదిలేస్తే మాత్రం వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us