AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పటి వరకు 1071 అడుగుల నీరు వచ్చి చేరింది. నీటి నిల్వ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2020 | 1:04 PM

Share

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పటి వరకు 1071 అడుగుల నీరు వచ్చి చేరింది. నీటి నిల్వ 90 టీఎంసీలకు గానూ 31 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5621 క్యూసెక్కులుగా ఉంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పై నుండి వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

ఈ నెల 1వ తేదీన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచిన అధికారులు..0.628 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో గోదారి పరవళ్లు తొక్కుతూ..దిగువప్రాంతంలో గల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌లోని వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొదని, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ఎస్‌పీ అధికారులు సూచించారు.