AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Floods: దేశవ్యాప్తంగా వరదల బీభత్సం.. నిరాశ్రయులైన లక్షలాది మంది.. పలువురి మృతి..

దేశవ్యాప్తంగా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. గుజరాత్‌లో ఇంకా పలు జిల్లాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కూడా కుండపోత వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థంగా మారింది.

India Floods: దేశవ్యాప్తంగా వరదల బీభత్సం.. నిరాశ్రయులైన లక్షలాది మంది.. పలువురి మృతి..
Gujarat Flood
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2022 | 12:28 PM

Share

India Floods: దేశ వ్యాప్తంగా వరదలు బీభత్స కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 83 మంది ప్రాణాలు కోల్పోయారు. నవసరాయ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వల్సాద్‌, జామ్‌నగర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, జునాఘడ్‌ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నవసరాయ్‌లో ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు మనుషులతోపాటు మూగజీవాలను కాపాడుతున్నాయి. జంతు ప్రేమికులు కూడా బోట్లలో వెళ్లి వరదలో చిక్కున్న ఆవులకు, పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు.

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 99 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో వరదల బీభత్సంలో ఓ యువకుడు స్టంట్‌ చేయబోయాడు. వరద ప్రవాహంలో ఎత్తైన బ్రిడ్జ్‌ నుంచి కిందకు జంప్‌ చేశాడు. ఒకేసారి వరద ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు నయీం అమీన్‌ అనే యువకుడు. ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 24 గంటలు గడిచినప్పటికీ నయీం అమీన్‌ జాడ చిక్కడం లేదు. గల్లంతైన నయీం కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షం

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్మదాపురం లోని తావా డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో 10 గేట్లను ఎత్తారు అధికారులు . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!