Garib Rath Express Fire: గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలులో భారీగా మంటలు.. మూడు బోగీలు దగ్ధం
మంటలను చూసిన లోకో పైలట్ అత్యవసర బ్రేక్లు వేసి రైలును ఆపాడు. బోగీలోని ప్రయాణికులు వెంటనే దిగి, తమ లగేజీని లాక్కున్నారు. ఈ గందరగోళంలో రైలు దిగుతుండగా కొంత మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని తెలిసింది.. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక గంట ప్రయత్నం తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక మహిళ కాలిన గాయాలకు గురైనట్లు సమాచారం.

పంజాబ్లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ వద్ద గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా రైలులో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం ఉపశమనం కలిగించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, లూథియానాకు చెందిన అనేక మంది వ్యాపారవేత్తలు ప్రయాణిస్తున్న కోచ్ నంబర్ 19లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
మంటలను చూసిన లోకో పైలట్ అత్యవసర బ్రేక్లు వేసి రైలును ఆపాడు. బోగీలోని ప్రయాణికులు వెంటనే దిగి, తమ లగేజీని లాక్కున్నారు. ఈ గందరగోళంలో రైలు దిగుతుండగా కొంత మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని తెలిసింది.. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక గంట ప్రయత్నం తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక మహిళ కాలిన గాయాలకు గురైనట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించి ఉత్తర రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. బటిండా స్టేషన్ గుండా వెళుతుండగా రైలు నంబర్ 12204 అమృత్సర్ సహర్స గరీబ్ రథ్లో మంటలు చెలరేగినట్లు పేర్కొంది. వేగంగా స్పందించిన లోకోపైలట్, సిబ్బంది రైలును ఆపివేసి మంటలను ఆర్పివేశారు. ఒక ప్రయాణీకుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే శాఖ కూడా పేర్కొంది.
వీడియో ఇక్కడ చూడండి..
#BREAKING : Coach of Garib Rath Express Catches Fire at Sirhind, All Passengers Safe
Fire breaks out in a coach of the Amritsar–Saharsa Garib Rath Express at Sirhind station, Punjab.
Fire brought under control, all passengers safe. No injuries reported.#Punjab #IndianRailways… pic.twitter.com/QQ0rnrUyci
— upuknews (@upuknews1) October 18, 2025
ప్రయాణికుల ప్రకారం, రైలు ఉదయం 7 గంటలకు సిర్హింద్ స్టేషన్ దాటింది. ఒక ప్రయాణీకుడు 19వ నంబర్ కోచ్ నుండి పొగలు పైకి లేచినట్లు గమనించాడు. అతను వెంటనే కేకలు వేసి గొలుసును లాగాడు. పొగతో పాటు మంటలు పెరగడంతో భయాందోళనలు చెలరేగాయి. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు తమ సామానులను బోగీలోనే వదిలేసి వెళ్లారు. సమాచారం అందిన వెంటనే, రైల్వే, అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ గందరగోళంలో ప్రయాణికులు వేగంగా కోచ్ నుండి దిగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు తమ లగేజీని కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్టుగా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








