విలీనమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు..
దేశంలో ఇప్పటి వరకు సేవలందించిన పలు జాతీయ బ్యాంకుల విలీనానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇదే విషయంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టినట్టుగా తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ […]
దేశంలో ఇప్పటి వరకు సేవలందించిన పలు జాతీయ బ్యాంకుల విలీనానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇదే విషయంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టినట్టుగా తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడనున్నట్లు చెప్పారు. అదే విధంగా కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్గా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇక ఇండియన్ బ్యాంక్ను అలహాబాద్ బ్యాంక్లో విలీనమవుతుందని మంత్రి చెప్పారు. దేశంలో ఇప్పటివరకు ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 వరకు ఉంది. ఆ సంఖ్య మంత్రి ప్రకటనతో 12 కు తగ్గిపోయింది.