AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raids: మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు.. సీఎం బావమరిదికి చెందిన రూ.6.25 కోట్ల స్థిరాస్తులు సీజ్‌

మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డ (భార్య సోదరుడు) శ్రీధర్‌ మాధవ్‌ పాతంకర్‌ కంపెనీకి చెందిన రూ.6.45 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం జప్తు చేసింది.

ED Raids: మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు.. సీఎం బావమరిదికి చెందిన రూ.6.25 కోట్ల స్థిరాస్తులు సీజ్‌
Ed Raids
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 23, 2022 | 7:57 AM

Enforcement Directorate seizes: మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) బావమరిది  (భార్య సోదరుడు) శ్రీధర్‌ మాధవ్‌ పాతంకర్‌ కంపెనీకి చెందిన రూ.6.45 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం జప్తు చేసింది. ఈడీ చర్యపై శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి యజమాని అయిన శ్రీధర్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే థాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో గల 11 ఫ్లాట్లను సీజ్‌ చేసినట్టు పేర్కొంది.

మరోవైపు ఆస్తుల జప్తు రాజకీయ కక్షసాధింపేనని శివసేన విమర్శించింది. ‘తనకు లొంగని వ్యక్తులపై కేంద్రం ఇలాంటి దాడులకు పాల్పడుతున్నది. బెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ఈడీ వేధిస్తున్నది. అలాగే మహారాష్ట్రలోనూ ఇదే పంథాను కొనసాగిస్తున్నది. ఇది కేంద్రం కక్షసాధింపు చర్యే’ అని శివసేన ధ్వజమెత్తింది. ఈడీ చర్య రాజకీయ ప్రేరేపితమైనదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని అన్నారు.

శివసేన, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ కూడా ఈడీ చర్యను తీవ్ర ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని, కొన్నేళ్ల క్రితం చాలా మందికి ఈడీ గురించి తెలియదని, కానీ నేడు ఆ విషయం గ్రామ ప్రజలకు కూడా తెలుసునని కేంద్రంపై మండిపడ్డారు. శరద్ పవార్ మాట్లాడుతూ, “కేంద్ర ఏజెన్సీ వనరులను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని, ఇది ప్రస్తుతం దేశం ముందు ఉన్న ముఖ్యమైన సమస్య అన్నారు. రాజకీయ కారణాలతో కొందరిని వేధించేందుకే ఈ చర్య తీసుకున్నారని పవార్ మండిపడ్డారు.

ఇదిలావుంటే, ముంబై సమీపంలోని థానేలో ఉన్న శ్రీ సాయిబాబా హోమ్ నిమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ నీలాంబరి ప్రాజెక్ట్‌లోని 11 రెసిడెన్షియల్ ఫ్లాట్‌లను అటాచ్‌మెంట్ చేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. థాకరే భార్య రష్మీ సోదరుడు శ్రీధర్ మాధవ్ పాటంకర్ శ్రీ సాయిబాబా గృహిరుడి ప్రైవేట్ లిమిటెడ్‌ను కలిగి ఉన్నారని నియంత్రిస్తున్నారని పేర్కొంది. ఇదే నెలలో మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సమీప బంధువులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. కేంద్ర ఏజెన్సీల ద్వారా తమ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులను బీజేపీ సర్కార్ నిరంతరం టార్గెట్ చేస్తోందని శివసేన ఆరోపిస్తోంది.

అలాగే, ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై జరిగిన ఐటీ దాడులపై అప్పట్లో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘బీఎంసీకి ఎన్నికలు జరగనంత వరకు ఐటీ ప్రతి వార్డుకు వెళ్తుందని అనుకుంటున్నా.. ఇప్పుడు కేంద్ర సంస్థలకు మిగిలింది ఇదే.. దేశం మొత్తం తెలుసుకోవాలన్నారు. అందుకే కేంద్ర ఏజెన్సీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే దాడులు నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సంజయ్ రౌత్ నిరంతరం ఆరోపిస్తున్నారు. మరే రాష్ట్రంలోనూ తనకు రాలేదా అని ఆయన ఇటీవల అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, ఐటీలకు 50 మంది పేర్లను ఇచ్చామని, ఆధారాలతో సహా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎంపీలు ఇలాంటి ఫిర్యాదు చేస్తే సీరియస్‌గా తీసుకోవాలని ఈడీ, ఐటీకి అర్థం కావడం లేదని అన్నారు.

Read Also…

Petrol-Diesel Price Today: బాదుడే.. బాదుడు.. రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు