AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarinder Singh: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోకుంటే బలవంతపు సెలవు..

Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న

Amarinder Singh: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోకుంటే బలవంతపు సెలవు..
Amarinder Singh
Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2021 | 8:02 AM

Share

Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న వైద్య నిపుణుల హెచ్చరికలతో ప్రభుత్వం వ్యాక్సిన్‌ తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని ప్రజలను కోరింది. ఈ క్రమంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. క‌నీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను బ‌ల‌వంత‌పు సెల‌వుపై పంపాల‌ని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాల‌ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు కోవిడ్‌ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కోవిడ్‌-19 ప‌రిస్థితిపై స‌మీక్షా స‌మావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధ‌న అమ‌లుకు ఈ నెల 15 వ‌ర‌కు గ‌డువుగా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య కార‌ణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని వారికి మిన‌హాయింపు ఇస్తున్నట్లు సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. పండుగ సీజన్‌ కావడంతో ప్రతీఒక్కరూ నిబంధనలు పాటించాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు ఇప్పటికైనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు.

అయితే.. 4 వారాల ముందు వ్యాక్సిన్ తీసుకున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బందినే విద్యా సంస్థలకు అనుమ‌తినిస్తూ సీఎం అమ‌రీంద‌ర్ ఆదేశాలు జారీ చేశారు. లేని ప‌క్షంలో వారానికొకసారి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుందంటూ స్పష్టంచేశారు. దీంతోపాటు.. పూర్తిగా వ్యాక్సినేష‌న్ పూర్తయితేనే అంగ‌న్వాడీ కేంద్రాల‌ను తెరవాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఎందుకంటే..?

9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. తెర వెనుక ఇంత జ‌రిగిందా..!