Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయపెడుతోన్న బర్డ్ ఫ్లూ.. 20 వేలకు పైగా కోళ్లు, బాతులను చంపేందుకు ఆపరేషన్

ఈ ఇన్ఫెక్షన్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. బాతులతోపాటు కోళ్లు, బాతులు,  ఇతర పక్షులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని, వాటితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

భయపెడుతోన్న బర్డ్ ఫ్లూ..  20 వేలకు పైగా కోళ్లు, బాతులను చంపేందుకు ఆపరేషన్
Avian Flu
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2022 | 9:28 PM

కేరళలోని అలప్పుజా జిల్లాలో బాతుల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఉన్నట్లు నిర్ధారించారు. ఇలా 20 వేలకు పైగా పక్షులను చంపేందుకు హరిపాడు మున్సిపాలిటీ ఆపరేషన్ ప్రారంభించింది. ఏవియన్ వైరస్ అనుమానంతో చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజెస్‌కు పంపారు. ఈ టెస్టు రిపోర్టులో ఇన్ఫెక్షన్ వ్యాపించినట్లు తెలిసింది. అందుకోసం శనివారం నుంచి వ్యాధి ప్రబలిన ప్రాంతానికి కిలోమీటరులోపు అన్ని బాతులను చంపే పని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20,471 బాతులను గుర్తించారు. ఇందుకోసం 10 మంది చొప్పున ఎనిమిది ర్యాపిడ్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పశువైద్యాధికారుల ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆపరేషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా జంతు సంరక్షణ అధికారి డిఎస్ బిందు నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సహా వివిధ శాఖల అధికారులు వ్యాధి సోకిన ప్రాంతాలను సందర్శించారు.

బాతులను చంపే ఆపరేషన్లు పూర్తయినా ఆరోగ్య, పశుసంక్షేమ శాఖలు హరిపాడు మున్సిపాలిటీ, పల్లిపాడు పంచాయతీ, పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు పర్యవేక్షణ కొనసాగిస్తాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి చెందడంతో కిలోమీటరులోపు పక్షుల సంచారంపై నిషేధం విధించారు. దీంతోపాటు హరిపాడు మున్సిపాలిటీ, సమీపంలోని వివిధ పంచాయతీల పరిధిలో గుడ్లు, బాతులు, కోళ్లు, పెద్దబాతులు సహా పెంపుడు పక్షుల మాంసం వినియోగం, విక్రయాలపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ఇది కాకుండా, దేశీయ పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు లేదా వినియోగాన్ని నిరోధించడానికి నలుగురు సభ్యుల బర్డ్ స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇన్ఫెక్షన్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. బాతులతోపాటు కోళ్లు, బాతులు,  ఇతర పక్షులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని, వాటితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి