AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: ఫుల్లుగా తాగాడు.. స్నేహితుడిని ఆటోతో ఢీకొట్టాడు.. అక్కడికక్కడే..

ఆ తర్వాత శరవణన్‌ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు అది గమనించలేదు..ఆటోను శరవణన్‌ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్‌ మృతిచెందాడు.

Tamil Nadu: ఫుల్లుగా తాగాడు.. స్నేహితుడిని ఆటోతో ఢీకొట్టాడు.. అక్కడికక్కడే..
Accident
Jyothi Gadda
|

Updated on: Sep 18, 2022 | 9:41 PM

Share

Tamil Nadu: చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుడిపై ఆటో ఎక్కించాడు. దాంతో అతడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ దారుణ ఘటన కరూర్‌ జిల్లా తోగైమలై సమీపంలో చోటు చేసుకుంది. కన్నైకలై పంచాయతీ సుక్కాంపట్టికి చెందిన శరవణన్‌ లోడు ఆటోలో దుకాణాలకు నీళ్లను సప్లై చేస్తున్నాడు. అతని స్నేహితుడు పుట్టూర్‌ పంచాయతీకి చెందిన వెంకటతాంపట్టికి చెందిన కుమరిముత్తు. ఇతను ఆ ప్రాంతంలో సెలూన్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సుక్కాంపట్టి, కులందైపట్టికి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు.

ఆ తర్వాత శరవణన్‌ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు అది గమనించలేదు..ఆటోను శరవణన్‌ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్‌ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరవణన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మారిముత్తుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి