AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Drone Attack: వైమానిక స్థావ‌రంపై దాడి కేసు విచార‌ణ‌.. రంగంలోకి దిగిన NIA

జ‌మ్ములో వైమానిక స్థావ‌రంపై దాడి కేసు విచార‌ణ‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్ప‌గిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన...

Airport Drone Attack: వైమానిక స్థావ‌రంపై దాడి కేసు విచార‌ణ‌.. రంగంలోకి దిగిన NIA
Drone Cameras Control Crime
Sanjay Kasula
|

Updated on: Jun 29, 2021 | 4:28 PM

Share

జ‌మ్ములో వైమానిక స్థావ‌రంపై దాడి కేసు విచార‌ణ‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్ప‌గిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో  ఈ నెల 27వ తేదీన జ‌మ్మూ వైమానిక స్థావ‌రంపై బాంబు దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉగ్ర‌వాదులు డ్రోన్ల‌తో వైమానిక స్థావ‌రంపై బాంబు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు.

జ‌మ్మూ విమానాశ్రయంలోని వాయుసేన కార్యకలాపాలు నిర్వహించే స్థావరంలో పేలుడు కలకలం సృష్టించిన విష‌యం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్‌ ఏరియాలోని ఒక బిల్డింగ్‌ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు.

2002లో కూడా ఇదే స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు 10 మంది పిల్లలు సహా 31 మంది చనిపోయారు. కాగా, జమ్ములోని వాయుసేన స్థావరంపై రెండు డ్రోన్లతో దాడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్‌ 2 కిలోల చొప్పున శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. జైషే మహ్మద్‌ ఈ దాడి వెనుక ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:  Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..