చిన్నారికి ప్రాణం పోసిన సామాన్యులు, నెలన్నర రోజులలోపే 16 కోట్ల విరాళాల సేకరణ

ఎంత సంపాదిస్తే ఏం లాభం? అవసరానికి ఆదుకునే మనసు లేకపోతే! చేతనైనంత సాయం చేయాలనే సహృదయం ఉండాలి.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నారి విషయంలో మనలో ఇంకా ఆ మానవత్వం ఉందని రుజువైంది.

చిన్నారికి ప్రాణం పోసిన సామాన్యులు, నెలన్నర రోజులలోపే 16 కోట్ల విరాళాల సేకరణ
Dhairyaraj Singh Finally Gets Treatment Against Rare Sma Disease
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 08, 2021 | 3:05 PM

ఎంత సంపాదిస్తే ఏం లాభం? అవసరానికి ఆదుకునే మనసు లేకపోతే! చేతనైనంత సాయం చేయాలనే సహృదయం ఉండాలి.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నారి విషయంలో మనలో ఇంకా ఆ మానవత్వం ఉందని రుజువైంది. ధైర్యరాజ్‌ సింగ్‌ రాథోడ్‌ అనే ఈ బాబు ప్రాణాలు కాపాడేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆ చిన్నారి వైద్య ఖర్చులు సమకూర్చారు. ఒకటో రెండో లక్షలనుకునేరు. ఏకంగా 16 కోట్ల రూపాయలను తమ మంచి మనసుతో ఇచ్చారు. పాపం ఆ పిల్లోడు పుట్టుకతోనే అత్యంత అరుదైన స్పైనల్‌ మస్కులార్‌ ఆంట్రోపీ టైప్‌-1 అనే వ్యాధి కమ్ముకుంది. ఆ రోగం నుంచి ఆ పిల్లోడిని బయటపడేయడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. సరైన సమయంలో వైద్యం అందించలేకపోతే ప్రాణానికి ప్రమాదం అని గ్రహించారు.

నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధితో బాధపడేవారు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకలేరన్న కఠోర వాస్తవాన్ని పేరంట్స్‌కు వివరించారు. ప్రాణాలు కాపాడాలంటే జోల్‌ జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ ఇవ్వాలని, దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుందన్నారు. పైగా ఈ ఇంజెక్షన్‌ ఖరీదు 16 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ మాట విన్న తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంత డబ్బు ఎక్కడ్నుంచి తేగలరు? ఆస్తులన్నీ అమ్ముకున్నా అంత రాదు.. ఇక బాబును బతికించుకోవడం కష్టమేననుకున్నారు. దేవుడు మీద భారం వేశారు. అయితే దాతలు దేవుడి రూపంలో వచ్చి ఆదుకున్నారు. ఆ ఖరీదైన ఇంజెక్షన్‌కు అవసరమైన 16 కోట్ల రూపాయలను 42 రోజులలో సమకూర్చారు. వైద్యులు ఆ బాబుకు ఇంజెక్షన్‌ ఇచ్చారు.

ఇప్పుడు బాబు ప్రాణాలు సురక్షితం. అన్నట్టు ఈ విరాళాల సేకరణలో ఇంపాక్ట్‌ గురు అనే స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర వహించింది. విరాళాలు ఇచ్చింది కోటీశ్వరులు కాదు.. కేవలం సామాన్య ప్రజలే! మొత్తం 2.64 లక్షల మంది విరాళాలిచ్చి తమ చిన్నారి ప్రాణం కాపాడారని, వారి రుణం తీర్చుకోలేనిదని తల్లిదండ్రులు అన్నారు. జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ను అవెక్సిస్‌ అనే అమెరికా అంకుర సంస్థ డెవలప్‌ చేసింది. అమెరికాతో పాటు బ్రిటన్‌లో కూడా దీని వినియోగానికి అనుమతి లభించింది. వ్యాధిగ్రస్తుల శరీరంలోకి ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా చచ్చుబడిన ఎస్‌ఎంఎన్‌1 అనే జన్యువు యాక్టివ్‌ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:  Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

PM Modi: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్.. కరోనా పరిస్థితులపై ఆరా.. తక్షణ చర్యలపై సూచనలు!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..