AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే..

మద్యం ప్రియులకు ఇది పక్కా కిక్కేక్కించే వార్తే. అది కూడా ఫారిన్ లిక్కర్ అంటే ఇష్టపడేవారికి మాత్రమే. అవును ఢిల్లీ సర్కార్ లిక్కర్ ప్రియులకు కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం తక్కువకే అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇది అన్నింటికి కాదు. ఎవైతే.. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడే లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టినప్పుడు దొరికే ఫారిన్ (విదేశీ) లిక్కర్‌‌ను.. వాటిపై ఉండే ధర కంటే.. 25 […]

మద్యం ప్రియులకు కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 2:23 PM

Share

మద్యం ప్రియులకు ఇది పక్కా కిక్కేక్కించే వార్తే. అది కూడా ఫారిన్ లిక్కర్ అంటే ఇష్టపడేవారికి మాత్రమే. అవును ఢిల్లీ సర్కార్ లిక్కర్ ప్రియులకు కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం తక్కువకే అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇది అన్నింటికి కాదు. ఎవైతే.. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడే లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టినప్పుడు దొరికే ఫారిన్ (విదేశీ) లిక్కర్‌‌ను.. వాటిపై ఉండే ధర కంటే.. 25 శాతం తక్కువకే అమ్ముతామని తెలిపింది. పట్టుబడ్డ విదేశీ బాటిళ్లపై ఆథరైజ్డ్ కాన్ఫిస్కేటెడ్ లిక్కర్ అని రాసి ఉంటుందని పేర్కొంది. ఇప్పటి వరకు తనిఖీల్లో సీజ్ అయిన మద్యాన్ని పారబోయడం లేదా ధ్వంసం చేయడం లాంటివి చేస్తుండేవారు. అయితే అలా చేసే బదులుగా.. వాటిని తక్కువ ధరకు అమ్మాలని కేజ్రీవాల్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అయితే ఎది పడితే ఆ బాటిళ్లను అమ్మడం కాదని.. తొలుత దొరికిన మద్యం బాటిళ్లను ల్యాబ్ టెస్టుకు పంపి.. అందులో ఉన్న మద్యం క్వాలిటీ చెక్ చేసి.. నాణ్యమైనదేనని తేలితేనే అమ్మనున్నట్లు వివరణ ఇచ్చింది.

అయితే ఇలా పట్టుబడ్డ లిక్కర్ అమ్మే నిర్ణయాన్ని అమలు చేసే తొలి నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కనుంది. కాగా, అధికారిక సమాచారం ప్రకారం.. ఆబ్కారీ శాఖ ఏటా 2.5 లక్షల ఫారిన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంటోంది. గడిచిన 2018-19లో రూ.15 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసింది.