AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పోలింగ్‌కు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీపై బాంబ్‌ పేల్చిన ప్రధాని మోదీ.. !

పరీక్షలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, ఢిల్లీ విద్యావ్యవస్థతో పాటు, పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలో విద్యార్థులకు సూచించారు. ఈ సమయంలో, తదుపరి తరగతులకు విద్యార్థుల ప్రవేశంలో అడ్డంకులు వంటి కొన్ని అంశాల గురించి కూడా ప్రధాని మాట్లాడారు.

PM Modi: పోలింగ్‌కు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీపై బాంబ్‌ పేల్చిన ప్రధాని మోదీ.. !
Pm Modi With Students
Balaraju Goud
|

Updated on: Feb 04, 2025 | 8:14 AM

Share

ఢిల్లీలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పాస్ అవుతారని నమ్మకం ఉన్న విద్యార్థులనే ప్రమోట్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ సర్కార్ విద్యావ్యవస్థలో అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు ప్రధాని.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆమ్‌ ఆద్మీ పార్టీపై బాంబ్‌ పేల్చారు. ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఇక్కడి పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆమ్‌ ఆద్మీ పార్టీ అనుమతించడం లేదని చెప్పారు. కేవలం పాస్‌ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతులకు పంపిస్తున్నారని తెలిసిందన్నారు. రిజల్ట్‌ సరిగా రాకపోతే.. ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను పైచదువులు చదవకుండా విద్యా వ్యవస్థలోనూ ఆప్ అవినీతికి పాల్పడుతుందన్నారు. ఆప్‌ ప్రతిష్ఠను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.

ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి, 11 వ తరగతిలో ఫెయిలయ్యే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో ఏటా లక్ష మందికి పైగా ఫెయిల్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ విద్యావ్యవస్థపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ..
200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ..
సైబర్ మోసాల నుంచి రక్షణ.. మార్కెట్లో సైబర్ ఇన్యూరెన్స్‌లు..
సైబర్ మోసాల నుంచి రక్షణ.. మార్కెట్లో సైబర్ ఇన్యూరెన్స్‌లు..
డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి
డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి
కానిస్టేబుల్ కొలువులకు ఎట్టకేలకు మోక్షం.. ముహూర్తం ఫిక్స్!
కానిస్టేబుల్ కొలువులకు ఎట్టకేలకు మోక్షం.. ముహూర్తం ఫిక్స్!
శ్రియ ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..
శ్రియ ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..
డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
'హార్దిక్ పాండ్యా ఓ తోపు.. ఆ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు'
'హార్దిక్ పాండ్యా ఓ తోపు.. ఆ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు'
కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం..!
కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం..!
బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం
బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం