
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం (07 జనవరి 2025) నాడు విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిభ్రవరి 5వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంలపై ఎలాంటి అనుమానలు అక్కర్లేదని స్పష్టంచేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కోటి 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 83.49 లక్షలు, మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
AAP పతనం మొదలయ్యింది.. ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆప్ పరాజయంపై ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఓటమికి కేజ్రీవాలే కారణమని ఆరోపించిన ఆయన.. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్ పతనం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు.
- Janardhan Veluru
- Updated on: Feb 9, 2025
- 10:23 pm
Delhi New CM: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం.. చైర్ రేసులో ఆరుగురి పేర్లు
కౌన్ బనేగా ఢిల్లీ సీఎం. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఇదే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ సీఎం రేసులో పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తోంది బీజేపీ హై కమాండ్. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. CM మ్యూజికల్ చైర్ రేసులో ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి.
- Ram Naramaneni
- Updated on: Feb 9, 2025
- 6:14 pm
Delhi CM Race: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..? మరోసారి మహిళకు ఛాన్సిస్తారా.. రేసులో ఉన్నది వీళ్లే..
హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో... కమలం వికసించింది. గత నాలుగు దఫాలు... ప్రత్యర్థులను ఊడ్చిపారేసిన చీపురు, ఈసారి ప్రతిపక్షానికి పరిమతమైంది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. ఆప్ 22 స్థానాల్లో గెలిచింది.. కాంగ్రెస్ అసలు ప్రభావమే చూపలేదు.. మరి, హస్తినకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కమలదళంలో ఆ సత్తా ఉన్న నాయకులెవరు? రేసులో ఉన్నదెవరు.. అధిష్ఠానం ఆశీసులు దక్కేదెవరికి? దేశరాజధానిలో ఇప్పుడిదే చర్చనీయాంశం. కొత్త బాస్ ఎవరనే విషయంలో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 11:33 am
BJP-NDA: దేశవ్యాప్తంగా వెలిగిపోతున్న బీజేపీ.. మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో పాగా వేసిందో తెలుసా..?
కమలం వెలిగిపోతోంది. కాషాయ దండు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తున్న పార్టీని ముందుండి నడిపిస్తున్నారు ప్రధాని మోదీ. పదేళ్లలో ఎన్నో విజయాలు సాధించినా.. ఈరోజు దక్కిన విజయం బీజేపీకి వెరీ స్పెషల్. అయితే ఇప్పటివరకు ఎన్నిరాష్ట్రాల్లో బీజేపీ ఉంది? ఎన్డీఏ పాలిత రాష్ట్రాలేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 7:28 am
Delhi Election Results 2025: తగ్గేదేలే.. ఒక్కో రాష్ట్రం.. పక్కా విజయం.. అంతటా కమ్మేస్తున్న కమలం
పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 7:36 am
Pawan Kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను కైవసం చేసుకున్నాయి.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీతో పాటు ఎన్డీయే శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై పవన్ కల్యాణ్ స్పందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2025
- 7:25 pm
Delhi Polls Result: ఆప్ దిగ్గజాలు.. త్రిమూర్తులు అవుట్..! అంతర్మథనంలో చీపురు పార్టీ..
దిగ్గజాలు.. త్రిమూర్తులు అవుట్... యస్...ఆప్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదరుదెబ్బ తగిలింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు. ఇటు జంగ్పురాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2025
- 7:06 pm
Watch: అందుకే ఢిల్లీలోనూ ఏపీ మాదిరి ఫలితాలు.. ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు
Delhi Election 2025 Results: ఢిల్లీలో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ గ్రాండ్ విక్టరీ వెనక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అమలు చేసింది బీజేపీ అధిష్ఠానం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగించింది. ఆప్ కంచుకోటలను బద్ధలు కొట్టింది.
- Janardhan Veluru
- Updated on: Feb 8, 2025
- 6:44 pm
PM Modi LIVE: ఢిల్లీలో దోచుకున్న సంపదను తిరిగి రప్పిస్తా.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.. విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.. ప్రధాని మోదీని కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. లైవ్ లో చూడండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2025
- 7:34 pm
CM Chandrababu: ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 9:21 am