AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1500 మనీ ఆర్డర్ చేసిన ఆర్ఎస్ఎస్ నేత.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలోని కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం దావాలో ఫిర్యాదుదారు కాంగ్రెస్ నాయకుడికి రూ.1,500 జరిమానా చెల్లించారు.

Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1500 మనీ ఆర్డర్ చేసిన ఆర్ఎస్ఎస్ నేత.. ఎందుకో తెలుసా?
Rahul Gandhi (File Photo)
Balaraju Goud
|

Updated on: May 01, 2022 | 6:54 AM

Share

RSS Leader send money to Rahul Gandhi: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలోని కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం దావాలో ఫిర్యాదుదారు కాంగ్రెస్ నాయకుడికి రూ.1,500 జరిమానా చెల్లించారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) జేవీ పలివాల్ ఫిర్యాదుదారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థానిక కార్యకర్త రాజేష్ కుంటే.. రాహుల్ గాంధీకి రూ.1,500 చెల్లించాలని ఆదేశించారు. విచారణను వాయిదా వేయాలని కోరినందుకు కుంటేకు జరిమానా విధించారు.

మార్చి, ఏప్రిల్‌ నెలలో విచారణను వాయిదా వేయాలని కుంటే రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుని మార్చికి రూ. 500, ఏప్రిల్‌కు రూ. 1000 రాహుల్ గాంధీకి చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆయన మనీ ఆర్డర్ ద్వారా చెల్లించినట్లు సమాచారం.

2014లో మహాత్మా గాంధీ హత్య వెనుక RSS హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. థానేలోని భివాండిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని చూసిన తర్వాత కుంటే అతనిపై కోర్టులో దావా వేశారు. ఈ ప్రకటనతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ట దెబ్బతింటుందని కుంటే పేర్కొన్నారు. ఇందుకు పరువు నష్టం కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రాహుల్ గాంధీ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని రాహుల్ గాంధీ కార్యాలయంలో మనీ ఆర్డర్ ద్వారా కుంటే పంపిన రూ.1500 అందాయని వెల్లడించారు.

Read Also…  Hanuman Chalisa Row హనుమాన్ చాలీసా ఆందోళనలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

 మరిన్ని జాతీయ వార్తల కోసం