Dark Web: 81.5 కోట్ల మంది ఆధార్ డేటా లీక్.. ఆన్లైన్లో అమ్మకానికి కీలక సమాచారం..
Aadhaar Data Leak: ఆధార్ గోప్యత విషయంలో మరోసారి ఆందోళన నెలకొంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం.. డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచడం సంచలనంగా మారింది. ICMR వద్ద అందుబాటులో ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్సైట్లో విక్రయానికి అందుబాటులో ఉంది.

Aadhaar Data Leak: ఆధార్ గోప్యత విషయంలో మరోసారి ఆందోళన నెలకొంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం.. డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచడం సంచలనంగా మారింది. ICMR వద్ద అందుబాటులో ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్సైట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇందులో ఆధార్, పాస్పోర్ట్ వివరాలతోపాటు పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు ‘బ్రీచ్ ఫోరమ్స్’పై పోస్ట్ చేసినట్టు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 81.5 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యూరిటీ పేర్కొంది. భారతీయుల డాటా చోరీ విషయాన్ని ముందుగా గుర్తించిన ‘రీసెక్యూరిటీ’.. అక్టోబర్ 9 న PWN0001 అనే మారుపేరుతో పిలిచే ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్, ఆధార్ వివరాలను ఉల్లంఘన ఫోరమ్లో పోస్ట్ చేసినట్లు వెల్లడించింది. తమ వద్దనున్న డాటాకు రుజువుగా నాలుగు శాంపిల్స్ను కూడా సదరు అజ్ఞాత వ్యక్తి బయటపెట్టినట్లు తెలిపింది. ఒక్కో శాంపిల్లో లక్ష మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. తమ హంటర్ (HUMINT) యూనిట్ పరిశోధకులు బెదిరింపు నటుడితో మాట్లాడేందుకు ప్రయత్నించారని కంపెనీ తెలిపింది. అయితే.. ఆధార్, పాస్పోర్ట్ సమాచారాన్ని $80,000 అంటే సుమారు రూ.66.60 లక్షలకు విక్రయించడానికి ఆఫర్ చేసినట్లు తెలిపింది. దీని గురించి ఒక హ్యాకర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
⚠️ India Biggest Data Breach
Unknown hackers have leaked the personal data of over 800 million Indians Of COVID 19.
The leaked data includes:
* Name * Father’s name * Phone number * Other number * Passport number * Aadhaar number * Age#DataBreach #dataleak #CyberSecurity pic.twitter.com/lUaJS9ZPDr
— Shivam Kumar Singh (@MrRajputHacker) October 30, 2023
కాగా.. భారత ఆరోగ్య వ్యవస్థపై హ్యాకర్లు దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్ దాడులు జరిగాయి. సర్వర్లన్నింటినీ తమ స్వాధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఔట్ పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులన్నీ ప్రభావితం చేశారు. అయితే, తాజాగా.. కరోనా పరీక్షలు జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా వైద్య సంస్థలు సేకరించిన పౌరుల వివరాలు ఐసీఎంఆర్కు, జాతీయ సమాచార కేంద్రానికి (ఎన్ఐసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ మూడు ప్రదేశాలలో ఎక్కడి నుంచి డాటా చోరీ అయిందో తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విచారణ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) డేటా లీక్ గురించి ICMRని అప్రమత్తం చేసింది. విక్రయం కోసం విడుదల చేసిన డేటాను ICMR ప్రధాన డేటాతో సరిపోల్చాలని ఏజెన్సీ తెలిపింది. లీక్ అయిన డేటాలో భారతీయ పౌరుల వ్యక్తిగత వివరాలతో కూడిన లక్ష ఫైల్స్ ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..