AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Mocha: బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాల్లో ‘మోచా తుఫాన్’ అల్లకల్లోలం.. అప్రమత్తంగా వెస్ట్ బెంగాల్..

Cyclone Mocha: మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య మోచా తుపాను తీరాన్ని..

Cyclone Mocha: బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాల్లో ‘మోచా తుఫాన్’ అల్లకల్లోలం.. అప్రమత్తంగా వెస్ట్ బెంగాల్..
Cyclone Mocha
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 14, 2023 | 11:02 PM

Share

Cyclone Mocha: మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య మోచా తుపాను తీరాన్ని దాటింది. వేగంగా దూసుకొస్తూ.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను షేక్‌ చేస్తోంది. గంటకు గరిష్ఠంగా 180, 190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దాంతో.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోచా.. ఐదో కేటగిరి తుపానుగా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను మూసివేశాయి. బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. బంగ్లాలో రోహింగ్యాలు నివసిస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం ‘కాక్స్ బజార్‌’కు తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతకుముందు.. 2007లో వచ్చిన తుపాను ధాటికి బంగ్లాదేశ్‌లో మూడు వేల మందికిపైగా మృతి చెందారు. బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.

అయితే వాస్తవానికి.. మొదట మోచా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు భావించారు. కానీ.. తుపానుగా మారిన తర్వాత దిశను మార్చుకుంది. బంగ్లాదేశ్‌, మయాన్మార్‌ సరిహద్దుల్లోని తీరం దాటింది. ఇక.. మోచా తుపాను విరుచుకుపడుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.