Coronavirus: ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌… రక్తం విషపూరితం.. మృతి

దేశం ఓవైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త ఫంగస్‌లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా....

Coronavirus:  ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌... రక్తం విషపూరితం.. మృతి
Death
Follow us

|

Updated on: May 30, 2021 | 1:23 PM

దేశం ఓవైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త ఫంగస్‌లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రోగులు ఫంగస్‌ల బారినపడి మరణిస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎంత ప్రయత్నించినా వైద్యులు చేసిన చికిత్స ఫలించలేదు. ఫంగస్ ల కారణంగా శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూనే కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి మెదడు సమీపంలో ఈ ఫంగస్‌ ఉందని, ఇప్పటికే ఆయన దవడలో సగభాగం తీసేసినట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనా బాధితుల్లో ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ సంఖ్య‌లో (12వేల పైచిలుకు) బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. అక్కడక్కడా వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి.

Also Read: పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..

ముదిరిన పైత్యం.. ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌… తిక్క కుద‌ర్చిన పోలీసులు