AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: కోవిడ్ వ్యాక్సిన్ ఎంత మందికి ఇచ్చారు.. దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా..

దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్(Covid Vaccination) కవరేజీ 172.29 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ(Central Health Ministry) శాఖ శనివారం తెలిపింది....

Knowledge: కోవిడ్ వ్యాక్సిన్ ఎంత మందికి ఇచ్చారు.. దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా..
Srinivas Chekkilla
|

Updated on: Feb 12, 2022 | 5:31 PM

Share

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఓ క్రతువులా కొనసాగుతోంది. కేవలం గత 24 గంటల్లో 46.82 లక్షల (46,82,662) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దీంతో ఇప్పటివరకు దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్(Covid Vaccination) కవరేజీ 172.29 కోట్ల డోసులకు చేరుకుందని పేర్కొంది.  ఆరోగ్య కార్యకర్తలకు 1,03,99,129 మొదటి డోసు(First Dose) ఇవ్వగా.. 99,25,930 మందికి రెండో డోసులు ఇచ్చామని తెలిపింది. 38,43,355 మంది ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసులు కూడా అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు రూ.27,945.14 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ పార్లమెంట్‌కు తెలిపారు. వ్యాక్సినేషన్‌కు 2022-23 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌తో దేశవ్యాప్తంగా 13 మంది పాలిచ్చే తల్లులపై స్వల్ప ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు. అందులో ఒక కేసు తెలంగాణలో నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వివరించారు.

నిపుణుల బృందం నుంచి సిఫార్సులు అందిన వెంటనే 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. పిల్లలకు టీకా ఇవ్వడంపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని ఆయన అన్నారు. శాస్త్రవేత్తల బృందం సిఫార్సు ఆధారంగా టీకాలు ఎప్పుడు వేయాలి, ఏ వయస్సు వారికి వేయాలో నిర్ణయిస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు COVID-19 టీకాలు వేయడం గత నెలలో ప్రారంభమైంది.

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు..

Read Also..  India Corona: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 50,407 మందికి పాజిటివ్, 804మంది మృతి

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు