AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారిద్దరూ కలవడానికి కరోనా సాయపడింది.. దాదాపు 33 సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకున్న కూతురు..

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వారిద్దరూ కలవడానికి కరోనా సాయపడింది.. దాదాపు 33 సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకున్న కూతురు..
Kerala
Rajitha Chanti
|

Updated on: May 20, 2021 | 7:11 PM

Share

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఇంతమందికి నష్టాన్ని చేకూర్చిన వైరస్ మాత్రం ఒక మహిళకు సాయపడింది. చనిపోయాడు అనుకున్న తండ్రిని తనకు దగ్గర చేసింది. దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఆ మహిళ తన తండ్రిని కలిసింది. వివరాల్లోకెలితే…

పాలక్కడ్ కు చెందిన అజిత చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేకుండానే పెరిగింది. ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత తండ్రి శివాజీ ఓ రాజకీయ పార్టీ కార్యకర్త. అయితే రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట ఓ హత్య చేశాడని అభియోగంతో పోలీసులు పట్టుకెళ్లారు. దీంతో ఆయన భార్య మతిస్థిమితం కోల్పోయి మరణించింది. ఇక అప్పటి నుంచి అజితను తన అమ్మమ్మ వాళ్లు పెంచుకోసాగారు. రాజకీయ పార్టీలలో తిరిగి తమ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడనే కోపంతో వారు శివాజీ గురించి అజితకు ఏం చెప్పలేదు. దీంతో తన తండ్రి కూడా మరణించాడు అని అనుకుంది అజిత. ఆమె వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల లాక్ డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు ఓకే విధంగా ఉండడంతో జైలులో ఉన్న వ్యక్తి తన తండ్రే అని అజితకు తెలిసింది. ఇంకేముందు వెంటనే తన తండ్రిని కలుసుకోవడానికి జైలుకు పరుగులు తీసింది.

ఇక తన తండ్రిని కలిసి అజిత అసలు విషయం తెలుసుకుంది. శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయిత శిక్షాకాలంలో అతను పారిపోయే ప్రయత్నం చేయడంతో.. ఇప్పటికీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇక తండ్రిని విడిపించుకోవడానికి అజిత ఎంతోమందిని కలిసింది. కానీ ఫలితం లేకపోయింది. చివరకు తనకు కరోనా సాయపడింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంతో శివాజీకి 3 నెలలు పెరోల్ ఇచ్చారు. ఇక అజిత వెంటనే తన తండ్రిని తన ఇంటికి తీసుకువచ్చింది. శివాజీ వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు.. జైలు నుంచి బయటకు వచ్చాననే సంతోషం.. మరోవైపు కూతురితో ఉన్నానన్న ఆనందం శివాజీకి మిగిలింది.

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి.. సాయం కోసం అభ్యర్థించిన ఫలితం లేదు..

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..

Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్