AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌

Coronavirus: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా హడలెత్తిస్తోంది..

Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌
Subhash Goud
|

Updated on: May 10, 2021 | 6:16 AM

Share

Coronavirus: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా హడలెత్తిస్తోంది. మావోయిస్టులపై కరోనా పంజా విసురుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సుమారు 100 మంది వరకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు గట్టి నిఘా పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎప్పటికప్పుడు వారి ఆచూకీ కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. అయితే కరోనా సోకిన వాళ్లలో మహిళా మావోయిస్టు నేత సుజాతతో పాటు జయలాల్‌, దినేష్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా సోకిన మావోయిస్టులకు ఉచితంగా వైద్య అందిస్తామని పోలీసులు వెల్లడించారు. సుజాతపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం. కరోనా సోకిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలు పిలుపునిచ్చారు. అయితే కొరియర్లతో మావోయిస్టులకు కరోనా సోకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైదానం ప్రాంతాలకు వచ్చిన మావోయిస్టు నేతలతో దళాల్లో కరోనా పాకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ మావోయిస్టులకు దడ పుట్టిస్తోంది. కాగా, మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేతలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 20 మందికిపైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్న మావోయిస్టులు.. తరచూ బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతినిత్యం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. ఆ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జరిగే వంతెన, చెక్‌ డ్యామ్‌, రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు వాహనాలను సైతం తగులబెడుతున్నారు. అలాగే ఇటీవల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కనిపించని మావోయిస్టులు.. ఇటీవల నుంచి వారి కదలికలు ఎక్కువైపోవడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. వారిపై ప్రత్యేక నిఘా పెంచి అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Lockdown: కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌.. నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి..!

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!

Follow Us
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!