AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidhu meets PK: కాంగ్రెస్‌లో చేరికకు నో చెప్పిన పీకే.. ఇంతలోనే కీలక నేతతో భేటీ.. అసలు మతలబు ఏంటి?

ప్రశాంత్ కిషోర్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయనను కలిశారు.

Sidhu meets PK: కాంగ్రెస్‌లో చేరికకు నో చెప్పిన పీకే.. ఇంతలోనే కీలక నేతతో భేటీ.. అసలు మతలబు ఏంటి?
Sidhu Meets Pk
Balaraju Goud
|

Updated on: Apr 26, 2022 | 6:59 PM

Share

Navjot Singh Sidhu meets Prashant Kishor: కాంగ్రెస్‌లో చేరాలన్న ప్రతిపాదనను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం తిరస్కరించారు. దీంతో పాటు కాంగ్రెస్‌కు ఆయన కీలక సూచనలు చేశారు. పరివర్తన సంస్కరణల ద్వారా లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరిష్కరించేందుకు నా స్థానంలో కాంగ్రెస్‌కు నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని ఆయన అన్నారు.

ప్రశాంత్ కిషోర్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయనను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన పోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నవజ్యోత్ సిద్ధూ. “పాత మిత్రుడు PKతో అద్భుతమైన సమావేశం జరిగింది… పాత వైన్, పాత బంగారం, పాత స్నేహితులే ఇప్పటికీ ఉత్తమమైనవి!!!” అంటూ ట్వీట్ చేశారు.

అంతకు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ, “ప్రశాంత్ కిషోర్‌తో సమర్పించిన నివేదికపై చర్చలు జరిపిన తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ ‘ప్రివిలేజ్డ్ వర్కింగ్ గ్రూప్ 2024’ని ఏర్పాటు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఈ గ్రూపులో భాగంగా బాధ్యతలు అప్పగించారు. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు ఆయన నిరాకరించాడు. పార్టీకి ఆయన చేసిన కృషి, సూచనలను గౌరవిస్తామని సూర్జేవాలా పేర్కొన్నారు.

సుర్జేవాలా వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే, కిషోర్ ట్వీట్ చేస్తూ, “ప్రత్యేకమైన కార్యవర్గంలో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ ప్రతిపాదనను నేను తిరస్కరించాను.” అంటూ ట్వీట్ చేశారు.

గత కొద్ది రోజులుగా కిషోర్‌ చేస్తున్న సూచనలు, పార్టీలో చేరే అవకాశంపై కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కిషోర్ సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికి ఏర్పాటైన కమిటీ నివేదికపై చర్చించిన తర్వాత, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడానికి, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సోమవారం నిర్ణయించారు.

పార్టీని బలోపేతం చేయడంతోపాటు 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానం ముందు సవివరమైన ప్రజెంటేషన్‌ ఇవ్వడం గమనార్హం. ఆయన సూచనలను పరిశీలించేందుకు సోనియా గాంధీ ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, ఈ రాష్ట్రాల్లో పొత్తులకు దూరంగా ఉండాలని కిషోర్ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల ప్రకారం, ప్రశాంత్ కిషోర్ తన ప్రజెంటేషన్‌లో కాంగ్రెస్ దాదాపు 370 లోక్‌సభ స్థానాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పొత్తుతో బరిలోకి దిగాలని కూడా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Read Also… Delhi High Court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. బంధీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి