Bharat Jodo Yatra: కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొననున్న సోనియా..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. అక్టోబరు 6న ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనబోతున్నారు.

Bharat Jodo Yatra: కర్నాటకలో కొనసాగుతున్న  భారత్ జోడో యాత్ర.. రాహుల్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొననున్న సోనియా..
Sonia Gandhi And Rahul Gandhi
Follow us

|

Updated on: Oct 06, 2022 | 7:58 AM

భారత్‌ జోడో యాత్ర కర్నాటకలో ఉత్సహంగా ముందుకు కదులుతోంది. మైసూర్‌లో పాదయాత్ర సందర్భంగా మందిర్‌, మసీదు, చర్చిని సందర్శించారు రాహుల్‌. ప్రతి పనికి 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్న ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఉందని విమర్శించారు రాహుల్‌.  కర్ణాటకలోని మాండ్యాలో గురువారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. అక్టోబరు 3న రాష్ట్రానికి వచ్చిన సోనియా హెచ్‌డి కోటే తాలూకాలోని బీరాంబలిలోని ఆరెంజ్ కౌంటీ రిసార్ట్‌లో తన కొడుకుతో 2 రోజులు బస చేశారు. ఆయుధపూజ, విజయదశమి పండుగల్లో భాగంగా రెండు రోజుల పండుగ విరామం తర్వాత ప్రారంభమయ్యే నేటి యాత్రలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.

గురువారం ఉదయం జక్కనహళ్లి క్రాస్ నుంచి పాండవపూర్ మహదేశ్వరాలయంలో పూజలు చేసి రాహుల్ గాంధీ రాష్ట్రంలో 5వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తన కుమారుడికి మద్దతు ఇవ్వనున్నారు.

సెప్టెంబర్ 7న కేరళ నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుకుంది. అలాగే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు గురువారం యాత్రలో పాల్గొని పాదయాత్ర కూడా చేయనున్నారు. చాలా కాలం తర్వాత సోనియా గాంధీ పార్టీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

జక్కనహళ్లి క్రాస్ వద్ద సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. ఈ పాదయాత్రలో సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, వేణుగోపాల్ కూడా ఐక్య యాత్రలో పాల్గొంటారు. పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఉదయం 11 గంటలకు ఊరేగింపు నాగమంగళ తాలూకాలోని చౌడేనహళ్లి గేట్‌లోకి ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఖరాద్య గ్రామ సమీపంలో రైతులతో రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మళ్లీ ప్రారంభమయ్యే యాత్ర నాగమంగళ తాలూకాలోని పొట్‌హోసూరు గేటు వద్ద బస చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం