AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..

హనుమాన్ శోభాయాత్రలో జరిగిన హింసాకాండ దేశ రాజధానిని వణికించింది. జహంగీర్‌పురిలో ర్యాలీపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారితీసింది. హింసలో పోలీసులు గాయపడ్డారు.

Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..
Jahangirpuri Violence
Sanjay Kasula
|

Updated on: Apr 17, 2022 | 10:05 AM

Share

హనుమాన్ శోభాయాత్రలో(Hanuman Jayanti Procession) జరిగిన హింసాకాండ దేశ రాజధానిని వణికించింది. జహంగీర్‌పురిలో ర్యాలీపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారితీసింది. హింసలో పోలీసులు గాయపడ్డారు. హనుమాన్‌ జయంతి వేళ దేశ రాజధాని ఢిల్లీలో హింసకు దారితీసింది. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో హనుమాన్‌ శోభాయాత్రపై దుండుగులు రాళ్లు రువ్వారు. జహంగీర్ పురి ప్రాంతంలో పలు వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అల్లర్లలో స్థానికులతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఘ‌ట‌న‌లో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.

ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించగా, వారిపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఊరేగింపుపై రాళ్లు రువ్వినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగులు కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే…

సీసీటీవీ ఫుటేజీలు, వైరల్ వీడియోల ద్వారా దాడి చేసిన వారిని గుర్తిస్తున్నారు. ఎవరి అరెస్టుపై విచారణ జరుగుతుంది. గత రాత్రి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత, ఢిల్లీ పోలీసులు నైట్ విజన్ డ్రోన్‌ల సహాయంతో జహంగీర్‌పురి ప్రాంతాన్ని పరిశీలించారు. తద్వారా ఎవరి పైకప్పుపైనా రాళ్లు, ఆయుధాలు నిక్షిప్తం చేయలేదని తెలుసుకోవచ్చు.

ఢిల్లీలో జరిగిన మొత్తం హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వరకు అందరూ రంగంలోకి దిగారు. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ మరియు క్రైమ్ బ్రాంచ్ ఈ మొత్తం కేసును విచారించనుంది. ఢిల్లీ అల్లర్లను కుట్ర కోణంలో కూడా విచారించనున్నారు.

అయితే, ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే కుట్ర వైపు చూపుతోంది. ఎందుకంటే ఘటన జరిగిన సమయంలో ఒక్కసారిగా రోడ్లపైకి విసిరిన రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ రాళ్లను ఇక్కడి ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పరిశోధన జరుపుతున్నారు పోలీసులు.

కేంద్ర హోంశాఖ సమీక్ష..

మరోవైపు హింసాకాండ ఘటనపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. వెంటనే ఘటనా స్థలాన్ని అదనపు బలగాలతో మోహరించి అదుపులోకి తెచ్చింది. మరోవైపు రాళ్లదాడి ఘటనను ‘ఉగ్రదాడి’గా అభివర్ణించారు బీజేపీ నేత కపిల్ మిశ్రా . శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ ఘటన తర్వాత ఢిల్లీలో పోలీస్ భ‌ద్రత‌ను పెంచారు. మరోవైపు హనుమాన్‌ జయంతి ర్యాలీపై రాళ్ల దాడిని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్‌ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..

Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..