CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ

న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు

CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ
Nv Ramana
Follow us

|

Updated on: Apr 30, 2022 | 12:11 PM

న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కోర్టుల్లో సిబ్బందిని త్వరితగతిన నియమించాలని సీజేఐ సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ వేదికగా జరిగిన హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో ఎన్వీ రమణ ఈ మాటలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ (PM NarendraModi) ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ ఎన్వీరమణ.. ‘ న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. అదేవిధంగా వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడివరకు అందరూ న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించాల్సిందే. చట్టం అందరికీ సమానమే. అధికార వర్గం తన బాధ్యతలు సమర్థంగా, సక్రమంగా నిర్వహిస్తే కోర్టు కేసులు తగ్గిపోతాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశౄలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66 శాతం భూతగాదాలవే. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పూర్తి నిరుపయోగంగా మారుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 20 మంది న్యాయమూర్తులే ఉంటున్నారు. ఫలితంగా కోర్టు్ల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసుల పరిష్కారం కోసం కిందిస్థాయి కోర్టు్ల్లో మరింత మంది సిబ్బందిని త్వరితగతిన నియమించాలి’ అని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

కాగా సీజేఐ ఎన్వీ రమణ చొరవతో ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సదస్సు జరిగింది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

మరిన్న జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..

Reliance Jio: ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు