AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Sincerity: కేసు నమోదైన భర్తను.. సొంత స్కూటీపై తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..?

ఎమ్మెల్యే ఏకంగా సెక్యూరిటీని, ప్రభుత్వ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు. అయితే ఇదే సమయంలో ఆమె స్వయంగా తన భర్తతో కలిసి జిల్లా పోలీసులకు అప్పగించారు.

MLA Sincerity: కేసు నమోదైన భర్తను.. సొంత స్కూటీపై తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..?
Chhanni Chandu Sahu
Balaraju Goud
|

Updated on: Feb 06, 2022 | 3:23 PM

Share

Chhattisgarh Congress MLA: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా(Rajnandgaon District)లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే చన్నీ సాహు(Chhanni Chandu Sahu) తన భర్తపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. అతన్ని అరెస్టు చేయాలని ప్రతిపక్ష బీజేపీ(BJP) డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఏకంగా సెక్యూరిటీని, ప్రభుత్వ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు. అయితే ఇదే సమయంలో ఆమె స్వయంగా తన భర్తతో కలిసి జిల్లా పోలీసు సూపరిండెంట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన్ను అరెస్టు చేయండి’ అని అన్నారు. అదే సమయంలో, భర్తను అరెస్టు చేయడంతో, ఎమ్మెల్యే స్కూటీలో ఇంటికి తిరిగి వచ్చారు. డిసెంబర్ 8, 2021న డ్రైవింగ్ చేస్తున్న బిర్సింగ్ ఉయికే సాహు అనే ట్రాక్టర్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ.. బెదిరించడంతో ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదైంది.

అసలు ఈ విషయానికి వస్తే.. శనివారం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ తతాంగం జరిగింది. జిల్లాలోని ఖుజ్జీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఛనీ సాహు భర్త చందు సాహుపై ట్రాక్టర్ డ్రైవర్ బిర్సింగ్ ఉయికే సాహు అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఈ విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సాహు తన సెక్యూరిటీ గార్డు, 3 పీఎస్ఓ, ప్రభుత్వ వాహనాన్ని అధికారులకు తిరిగి ఇచ్చేశారు. అనంతరం భర్త చందు సాహును తీసుకుని తన సొంత స్కూటీ వాహనంపై నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడే ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ.. ‘నా భర్తను తీసుకొచ్చాను.. అరెస్ట్ చేయండి. దీంతో చందు సాహును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజర్చగా, సాహును కోర్టు జైలుకు పంపింది.

భర్తపై రాజ్‌నంద్‌గావ్ జిల్లా పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఛని సాహు ఆరోపించారు. ఈ నిరసనల కారణంగా, అతను ప్రభుత్వం నుండి పొందిన భద్రతను తిరిగి ఇచ్చారు. కాగా, ఖుజ్జి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 2.5 లక్షల మంది తనను ఎన్నుకుని ప్రజాప్రతినిధిని చేశారని ఎమ్మెల్యే ఛని అన్నారు. అయితే, ఇప్పుడు ఆమె ఎలాంటి పీఎస్‌వో, సెక్యూరిటీ గార్డు లేకుండా ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంత ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆదేశించారు. అదే సమయంలో ఇసుక అక్రమ రవాణాపై ఆమె భర్త చందు సాహు పోరాడుతున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం చందు సాహుపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే ఛని సాహు ఆరోపించారు.

ఈ కేసు అక్రమ మైనింగ్, ఇసుక రవాణాకు సంబంధించినది కావడం గమనార్హం. ఖుజ్జి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చని సాహు పాటి, ట్రాక్టర్ డ్రైవర్ మధ్య గత రెండు నెలలుగా ఇసుక అక్రమ రవాణాపై వివాదం జరిగింది. దీని తర్వాత, ఎమ్మెల్యే భర్త చందు సాహుపై డ్రైవర్ బిర్సింగ్ ఉయికే ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే భర్తపై పోలీసులు అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read Also…. UP Election 2022: సీఎం యోగీ వద్ద రివాల్వర్‌.. ఇక నలుగురు మాజీ సీఎంల ఆస్తుల వివరాలు ఇవే..