మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మే 2 తేదీపైన ఉంది.. ఆ రోజు దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఇదమిత్థంగా తెలిసే రోజు కాబట్టే అంత ఆసక్తి.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు అదే!

మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
Central Govt Impose Complete Lock Down From May 2nd
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 28, 2021 | 2:12 PM

ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మే 2 తేదీపైన ఉంది.. ఆ రోజు దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఇదమిత్థంగా తెలిసే రోజు కాబట్టే అంత ఆసక్తి.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు అదే! ముఖ్యంగా బెంగాల్‌ అసెంబ్లీ ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ. అక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందా? వేస్తే దేశంలో మిగతా చోట్ల దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల ఫలితాలతో పాటే దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఆ రోజున కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదోనన్న ఆతృత. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాతే కరోనాపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవచ్చన్నది ఇన్‌సైడ్‌ టాక్‌! రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దానికి తోడు మరణాల సంఖ్య కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటున్నది. హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరకడం లేదు.. అవసరానికి ఆక్సిజన్‌ అందుబాటులో ఉండటం లేదు. ఎక్కడ చూసినా మరణరోదనలే వినిపిస్తున్నాయి. అంత్యక్రియలకు కూడా అవస్థలు పడాల్సిన దిక్కమాలిన రోజులు వచ్చాయి.. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్‌ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోకపోవడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అప్రమత్తం కాలేదు. ఆరంభంలోనే కొన్ని కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నది మెజారిటీ ప్రజల అభిమతం. ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమన్నది నిర్వివాదాంశం. మద్రాస్‌ హైకోర్టు కూడా ఇదే మాట చెప్పింది. కరోనా విజృంభణకు ఎన్నికలే కారణమని న్యాయస్థానం విమర్శించింది. సభలు సమావేశాలతో కరోనా అడ్డూ అదుపూ లేకుండా విస్తరించింది. ఇది వాస్తవం.. ఇదే వాస్తవం. తెలంగాణ ముఖ్యమంత్రికి కరోనా సోకడానికి కూడా ఎన్నికల సభనే కారణం. బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోంలలో కేసులు పెరగడానికి కారణం ఎన్నికలే! బెంగాల్‌లో ఇంకో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక కేంద్రం ఓ నిర్ణయానికి రావచ్చు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలా? లేక కఠిన ఆంక్షలు అమలు చేస్తే సరిపోతుందా? అన్నది అప్పుడు తేలుతుంది. అందుకే దేశ ప్రజలు మే 2వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన యువతకు టీకా..! ఇవాటి నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్.. ఎలాగో తెలుసుకోండి..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు