AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Budget 2024: భారత రైల్వే రంగానికి శుభవార్త.. కొత్తగా మూడు ఆర్థిక కారిడార్లు..

Railway Budget 2024 Latest News Updates: కేంద్ర మంత్రి నిరమలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేక చర్యలు తీసుకుంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి బడ్జెట్‌లో రైల్వేశాఖకు అద్భుతమైన బహుమతి లభించింది.

Railway Budget 2024: భారత రైల్వే రంగానికి శుభవార్త.. కొత్తగా మూడు ఆర్థిక కారిడార్లు..
Indian Railway
Balaraju Goud
|

Updated on: Feb 01, 2024 | 1:10 PM

Share

ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిరమలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేక చర్యలు తీసుకుంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి బడ్జెట్‌లో రైల్వేశాఖకు అద్భుతమైన బహుమతి లభించింది. గురువారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్న సంవత్సరాల్లో 3 కొత్త రైల్వే ఎకనామిక్ కారిడార్‌లను నిర్మిస్తామని చెప్పారు. ఈ కారిడార్లు పవర్, ఖనిజాలు, సిమెంట్ కోసం ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద గుర్తించడం జరిగిందన్నారు. ఇది ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను మెరుగుపరుస్తుంది. రైళ్లలో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. 40 వేల జనరల్ రైల్వే బోగీలతో వందే భారత్ ప్రయాణంగా మార్చనున్నారు.

బడ్జెట్ సమర్పణ సందర్భంగా, భారతీయ రైల్వేల మరింత అభివృద్ధి కోసం 2.4 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా, భారతీయ రైల్వేలకు ఇది అత్యధిక మూలధన వ్యయం. ఆసక్తికర విషయం ఏమంటే ఇది 2013-2014 యూనియన్ బడ్జెట్‌లో రైల్వేల కోసం చేసిన మూలధన వ్యయం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. అలాగే, బడ్జెట్ ప్రసంగంలో, సీతారామన్ రైల్వే పరిధిలో మూడు ప్రధాన కారిడార్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మల్టీ-మోడల్ కనెక్టివిటీ, ప్రయాణ వేగం పెంచడం, ఖర్చులను తగ్గించడం కోసం ఈ ప్రాజెక్టులు ప్రధాని గతి శక్తి కింద అభివృద్ధి చేస్తామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో రద్దీ తగ్గితే ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు కూడా తగ్గుతాయి. ఇది ప్రయాణీకులకు భద్రతను పెంచుతుంది. రైళ్లలో అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుందన్నారు ఆర్థిక మంత్రి.

ఫిబ్రవరి 15, 2019 న తన ప్రయాణాన్ని ప్రారంభించిన వందే భారత్, గత ఐదేళ్లలో భారతీయ రైల్వేలకు మూలస్తంభంగా మారింది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోని అనేక ప్రాంతాల మధ్య కనెక్టివిటీని సులభతరం చేసింది. అంతేకాదు వేగవంత ప్రయాణానికి దోహదపడింది. మధ్యంతర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా, 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. అలాగే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పెంచి పర్యాటకాన్ని పెంచుతామని ఆమె తెలిపారు.

అలాగే, 2014-15లో పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వదేశ్ దర్శన్ స్కీమ్‌ను కూడా ఆమె ప్రస్తావించారు, ఇందులో రైల్వేలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న టూరిజంను పెంచడానికి 2014-15లో దీనిని ప్రారంభించారు. భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక రైళ్లలో అనేక థీమ్-ఆధారిత పర్యాటక ప్యాకేజీలను ప్రారంభించింది. తద్వారా పర్యాటకులు భారతదేశం గొప్ప సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవచ్చు. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన పర్యాటక రైళ్లు మహాపరినిర్వాన్ ఎక్స్‌ప్రెస్, భారత్ దర్శన్ రైళ్లు, పంజ్ తఖ్త్ రైలు, ప్యాలెస్ ఆన్ వీల్స్, దక్కన్ ఒడిస్సీ రైళ్లు ప్రయాణీకులకు భారతదేశంలోని అనేక ముఖ్యమైన ప్రదేశాల సమగ్ర అనుభవాన్ని అందిస్తున్నాయి.

ఇక గతేడాది బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం రైల్వేలపైనే ఎక్కువ దృష్టి సారించింది. 2023 సంవత్సరానికి రూ.45 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌లో రైల్వే వాటా రూ.2.4 లక్షల కోట్లు. మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వేకు బడ్జెట్‌లో కేటాయింపులు అంతకంతకు పెరిగాయి. ఐదేళ్ల క్రితం అంటే 2019 బడ్జెట్‌లో రైల్వేకు రూ.69,967 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2020లో రైల్వేకు రూ.70,250 కోట్లు ఇచ్చారు. ఏడాది తర్వాత, అంటే 2021లో తొలిసారిగా రైల్వే బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటింది. కాగా, 2023లో అంటే గతేడాది రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు తొలిసారిగా రూ.2 లక్షల కోట్లు దాటాయి.

మోదీ ప్రభుత్వం కంటే ముందు రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2017 నుంచి ఈ సంప్రదాయం మారిపోయింది. ఆ సంవత్సరం అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ భాగమైపోయింది. అంతకు ముందు రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి ప్రత్యేకంగా సమర్పించారు. ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా, సాధారణ బడ్జెట్‌లో భాగంగా రైల్వే బడ్జెట్ వస్తోంది.

మరిన్ని బడ్జెట్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us