Pune: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జ్.. 15 మంది గల్లంతు..!
మహారాష్ట్రలోని పుణెలో ఇంద్రయాణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది. దీంతో ఆ ఘటనలో సుమారు 15 మంది పర్యాటకులు నదిలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించాయి. ఆరుగురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన డ్యామేజ్ అయినట్లు సమాచారం.

పుణే జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో పలువురు పర్యాటకులు గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం కుండమాల ప్రాంతంలో చోటుచేసుకుంది. వర్షాకాలంలో పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
#WATCH | Pune, Maharashtra | A bridge collapsed on the Indrayani River, near Kundamala village, under the Pimpri-Chinchwad Police station. 10 to 15 people feared trapped. 5 to 6 people have been rescued. More details awaited: Pimpri Chinchwad Police https://t.co/CiYAnNDiyS pic.twitter.com/g0jm7QE9Xv
— ANI (@ANI) June 15, 2025
మావల్ తాలూకాలోని కుందమల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్షాకాలంలో ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. కుందమల చేరుకోవడానికి ఇంద్రాయణి నదిపై ఒక పురాతన వంతెన ఉంది. అది అకస్మాత్తుగా కూలిపోవడంతో.. వంతెనపై ఉన్న 10 నుంచి 15 మంది నదిలో పడిపోయారు. కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు సమాచారం. కొంతమందిని స్థానికులు రక్షించారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంత మంది కొట్టుకుపోయారే ఖచ్చితంగా తెలియదు. అధికారులు వివరాలు తెలపాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
