AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు
Mumbai Bomb Threat
Surya Kala
|

Updated on: Feb 02, 2024 | 10:02 AM

Share

మహారాష్ట్రలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అందిన వెంటనే అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని 6 చోట్ల బాంబులు అమర్చినట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. సందేశం అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు ట్రేస్ చేసేందుకు రంగంలోకి దిగారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అర్థరాత్రి జాయింట్‌ సీపీ ఆదేశించారు. ఈ కాల్స్ పై  నగర పోలీసులతో పాటు క్రైం బ్రాంచ్ కూడా దర్యాప్తు చేస్తోంది.

నిందితుడి కోసం వెదుకుతున్న పోలీసులు

ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సందేశం పంపిన నంబర్‌పై నిఘా ఉంచారు. మొబైల్ లొకేషన్‌ను గుర్తించిన వెంటనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఇలాంటి కాల్స్

అయితే ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ వచ్చాయి. గతేడాది ఆగస్టులో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుడు జరగబోతోందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రైలులో బాంబులు ఉన్నాయని ఆ వ్యక్తి ముంబై పోలీసులకు తెలిపాడు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అశోక్ ముఖియా అతను బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసి. అశోక్ మద్యం మత్తులో ఫోన్ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు