AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు
Mumbai Bomb Threat
Surya Kala
|

Updated on: Feb 02, 2024 | 10:02 AM

Share

మహారాష్ట్రలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అందిన వెంటనే అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని 6 చోట్ల బాంబులు అమర్చినట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. సందేశం అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు ట్రేస్ చేసేందుకు రంగంలోకి దిగారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అర్థరాత్రి జాయింట్‌ సీపీ ఆదేశించారు. ఈ కాల్స్ పై  నగర పోలీసులతో పాటు క్రైం బ్రాంచ్ కూడా దర్యాప్తు చేస్తోంది.

నిందితుడి కోసం వెదుకుతున్న పోలీసులు

ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సందేశం పంపిన నంబర్‌పై నిఘా ఉంచారు. మొబైల్ లొకేషన్‌ను గుర్తించిన వెంటనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఇలాంటి కాల్స్

అయితే ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ వచ్చాయి. గతేడాది ఆగస్టులో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుడు జరగబోతోందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రైలులో బాంబులు ఉన్నాయని ఆ వ్యక్తి ముంబై పోలీసులకు తెలిపాడు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అశోక్ ముఖియా అతను బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసి. అశోక్ మద్యం మత్తులో ఫోన్ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు