Lok Sabha Elections 2024: ఈ రాష్ట్రంలో రసవత్తర పోరు.. సీట్లు కేటాయించే స్థాయికి బీజేపీ.. రేపే పోలింగ్..

తమిళనాడులో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుంటాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు అనుకూలంగా కొన్ని సార్లు, ప్రతిపక్షం కూటమికి అనుకూలంగా పలు సందర్భాల్లో తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. ఈసారి ఎప్పుడూ లేనివిధంగా త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎడిఎంకేతో ధీటుగా బిజెపి బలమైన కూటమిగా బరిలో ఉంది.

Lok Sabha Elections 2024: ఈ రాష్ట్రంలో రసవత్తర పోరు.. సీట్లు కేటాయించే స్థాయికి బీజేపీ.. రేపే పోలింగ్..
Tamil Nadu
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 4:01 PM

తమిళనాడులో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుంటాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు అనుకూలంగా కొన్ని సార్లు, ప్రతిపక్షం కూటమికి అనుకూలంగా పలు సందర్భాల్లో తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. ఈసారి ఎప్పుడూ లేనివిధంగా త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎడిఎంకేతో ధీటుగా బిజెపి బలమైన కూటమిగా బరిలో ఉంది. బిజెపి ఈ సారి తమిళనాట అత్యధిక స్థానాలే టార్గెట్‎గా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాట శతాధిక పార్టీలు ఉన్నాయి. ఒక్కో కూటమిలో పదికి పైగా పార్టీలు ఉండడం ఇక్కడ సర్వసాధారణం. మినిమిమ్ ఐదు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతుంటాయి. ఎన్నికలన్నాక కూటములు.. కూటమి అన్నాక పార్టీలు ఉండడం సహజం. అనేక సమీకరణాలతో మరిన్ని పార్టీలతో ఒక్కోసారి కలిసి వెళ్ళాక తప్పదు. తమిళనాట ఒక్కసారి కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఇక్కడ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్‎గా చూస్తుంటాం. ఒకప్పుడు ద్రవిడ వాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ అవసరాల కోసం ఆ సెంటిమెంట్‎నే కొనసాగిస్తున్నాయి.

దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో నడిచిన డీఎంకే, జయలలిత లీడ్ చేసిన ఎడిఎంకే, ఆ తర్వాత ఈ ఇద్దరు లేని ఆపార్టీల్లో కూడా పొత్తులు, అందులో అనేక పార్టీలు కూటమితో బరిలోకి దిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్న తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది బిజెపి ఆలోచన. అందుకు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఇప్పటికిప్పుడు అనుకున్న ఆలోచన కాదు. గడిచిన కొన్నేళ్లుగా ప్లాన్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తోంది బిజెపి. ప్రధాని నరేంద్రమోదీ కూడా తమిళనాడు అభివృద్ధి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల పదికి పైగా పర్యటనలు చేసి సుమారు 35 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఎన్నికల్లో ఎడిఎంకేతో కలిసి పొత్తుతో బరిలో నిలిచిన బిజెపి సక్సెస్ కాలేక పోయింది. 2014లో కన్యాకుమారి ఒక్క స్థానంలో గెలిచింది. అయితే 2019 లో బోణి కూడా కొట్టలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. ఆ తర్వాత బిజెపి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారి అన్నామలై వి.ఆర్.ఎస్ తీసుకుని పార్టీలో చేరారు. పార్టీ చీఫ్‎గా అవకాశం ఇచ్చింది అధిష్టానం. ద్రవిడ వాదం బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాయి అంటూ ద్రవిడ వాద పార్టీలపై పోరాటం, హిందూత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ మంచి ఫలితాలను సాధించగలిగింది. అలాగే డీఎంకే అధికారంలోకి వచ్చాక జరిగిన అవినీతి చిట్టా విడుదలతో అన్ని వర్గాలను టచ్ చేసింది బిజెపి.

ఇక ప్రతిపక్ష ఎడిఎంకేలో ఓపిఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఉన్న పోరుతో బలహీనంగా ఉంది పార్టీ. ఓపిఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఓపిఎస్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బిజెపి గట్టిగానే పనిచేస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలే కూటమి ఏర్పాటు చేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కొన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉండేది. గత ఎన్నికల్లో ఎడిఎంకే బిజెపికి ఆరు లోక్ సభ స్థానాలను కేటాయించింది. ఇప్పుడు బిజెపి కూటమిని ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయిస్తోంది. పుదుచ్చేరి ఒక ఎంపీ స్థానం, తమిళనాడులో 39 స్థానాలు ఉండగా 23 స్థానాల్లో బిజెపి పోటీకి సిద్ధమవుతోంది. తమిళనాడులో వన్నియార్ సుమాజిక వర్గ ఓటుబ్యాంకు బలంగా ఉన్న పీఎంకేకు 10 స్థానాలు కేటాయించింది బిజెపి. ఓపిఎస్‎కు 2, టిడివి దినకరన్ ఏర్పాటు చేసిన AMMK కు 3 స్థానాలు, తమిళ మానిల కాంగ్రెస్ (TMC) 02 స్థానాలు, విద్యాసంస్థల అధినేతలకు మరో రెండు స్థానాలు ఇవ్వగా మిగిలిన స్థానాల్లో బిజెపి బరిలో నిలవబోతోంది. తమిళ పార్టీల పంచాన చేరి ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బిజెపి సొంతంగా కూటమిని ఏర్పాటు చేయడం ఇపుడు తమిళ రాజకీయాల్లో సంచలనం. శుక్రవారం జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో 39, పుదుచ్చేరిలోని ఒక స్థానానికి ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార యాంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.