Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానేమో.. వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఏఎన్ఆర్ అవార్డుల ఫంక్షన్లో టాలీవుడ్ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోందన్నారు.
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. 17 ఏళ్ల నాటి తన మనసులోని బాధను బయటపెట్టారు. “తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. కానీ సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. అప్పుడు నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశా. ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అని అంటూ చిరంజీవి ఎమోషనల్గా మాట్లాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

