BJP: హర్యానాలో జాట్ల ఆగ్రహమే కొంప ముంచిందా?.. బీజేపీ ఆత్మపరిశీలన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఆ రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లపై ఆత్మపరిశీలన చేస్తోంది. తమకు ఎదురేలేదు అనుకున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లోనే కమలదళానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక బీజేపీ చతికిలపడింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

BJP: హర్యానాలో జాట్ల ఆగ్రహమే కొంప ముంచిందా?.. బీజేపీ ఆత్మపరిశీలన
Bjp
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 18, 2024 | 4:35 PM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఆ రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లపై ఆత్మపరిశీలన చేస్తోంది. తమకు ఎదురేలేదు అనుకున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లోనే కమలదళానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక బీజేపీ చతికిలపడింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే లోపాలు, పొరపాట్లు గుర్తించి సరిదిద్దకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. అందుకే కమలదళం పెద్దలు ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులపై అధ్యయనం, మేధోమధనం ప్రారంభించారు. మొత్తం 10 లోక్‌‌సభ స్థానాలున్న హర్యానా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుపొందాయి. 2019లో సాధించిన సంఖ్యతో పోల్చితే ఈ రాష్ట్రంలో బీజేపీ బలం సగానికి సగం తగ్గిపోయింది. అప్పుడు ఏకంగా 58.02% ఓట్లతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 28.42% ఓట్లతో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఈసారి బీజేపీ 46.11% ఓట్లు, కాంగ్రెస్ 43.67% ఓట్లు సాధించి చెరో 5 స్థానాలు గెలుపొందాయి. గణాంకాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ఏకంగా 15.25% మేర తమ బలాన్ని పెంచుకోగలిగింది. ఇదే సమయంలో బీజేపీ 11.91% ఓట్లను కోల్పోయింది. ఇది కమలనాథులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం.

జాట్ల ఆగ్రహం, దళితుల్లో అసంతృప్తి..

హర్యానాలో బీజేపీ పనితీరుపై కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కొత్తగా ఎన్నికల ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జులుగా నియమితులైన ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ కుమార్ దేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హర్యానా బీజేపీ కోర్ గ్రూప్ నేతలైన హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి), కృష్ణపాల్ గుర్జార్, కెప్టెన్ అభిమన్యు, సుధా యాదవ్, హర్యానా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఫణీంద్రనాథ్ శర్మ, సంజయ్ భాటియా, ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ సతీష్ పునియా, కో-ఇన్‌చార్జ్ సురేంద్ర నాగర్ తదితరులు ఈ కీలక భేటీలో పాల్గొని లోటుపాట్లపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా అంబాలా, సోనిపథ్ వంటి స్థానాల్లో ఓటమి వారిని కలవరపెట్టింది. అంబాలా బీజేపీకి వరుసగా విజయాలు అందిస్తున్న స్థానం. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం మొత్తమ్మీద సురక్షితమైన స్థానంగా బీజేపీ నేతలు భావిస్తారు. అలాంటి చోట ఓటమికి దారితీసిన పరిస్థితులేంటి అన్నదే అగ్రనాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. సుదీర్ఘ చర్చ అనంతరం రాష్ట్రంలోని జాట్ సామాజికవర్గం ఓటర్లలో నెలకొన్న ఆగ్రహం, దళితుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయని అంచనాకు వచ్చారు. జాట్ల ఆగ్రహానికి కారణాలను అన్వేషించి, వారిని ఆకర్షించేందుకు బీజేపీ త్వరలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి తదుపరి పార్టీ అధ్యక్షుడిగా జాట్ నేతనే ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పరిస్థితులను ఆకళింపు చేసుకోడానికి హర్యానా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమితులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 22, 23 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ప్రభావంతో దళితులు కొంత దూరమయ్యారని కమలనాథులు గ్రహించారు. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా రిజర్వుడు స్థానాల్లో ఈసారి బీజేపీ దెబ్బతినడానికి ఈ అంశమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. హర్యానాలో దళితులు దూరమవడంలో ఈ-గవర్నెన్స్ కూడా ఒక కారణమని తేలింది. ఆన్‌లైన్ విధానం, యాప్‌ల వాడకం గురించి అంతగా తెలియని వర్గాలు సైతం ఏదైనా ప్రభుత్వ పథకాన్ని పొందాలంటే తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన వర్గాల్లో ఈ చర్య అసంతృప్తికి కారణమైందని కొందరు విశ్లేషిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు ఇక నుంచి ఆన్‌లైన్‌తో పాటు పేపర్ మీద దరఖాస్తులు నింపి అందజేసే ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. మొత్తంగా పార్టీకి దూరమైన 12% ఓటర్లను మళ్లీ తిరిగి తమ వద్దకు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అక్టోబరు నెలలో హర్యానాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈ రాష్ట్రానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఇద్దరికీ లోటుపాట్లను గుర్తించి సరిదిద్దే కీలకమైన బాధ్యతలు అప్పగించింది.

నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ కోర్ గ్రూప్ భేటీ..

ఎన్నికల కసరత్తులో భాగంగా నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల బీజేపీ కోర్ గ్రూప్ నేతలతో పార్టీ అధిష్టానం సమావేశం కానుంది. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల కోర్ గ్రూపు నేతలతో పాటు కొత్తగా ఎన్నికల ఇన్‌ఛార్జులుగా నియమితులైన కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. మహారాష్ట్రకు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అలాగే ఝార్ఖండ్ రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మలు ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జులు పర్యటించడం కంటే ముందు జరిగే కోర్ గ్రూపు సమావేశంలో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లపై లోతుగా చర్చించనున్నారు. తద్వారా దిద్దుబాటు చర్యలు చేపడుతూ, రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!