AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగతనం కేసు ఒప్పుకోవాలని పోలీసుల చిత్రహింసలు! యువకుడు చెప్తుంటే.. జడ్జి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు..

బీహార్‌లోని భాగల్పూర్‌లో పోలీసుల దారుణం వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసులో నిందితుడిగా అనుమానించబడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, చేయని నేరం ఒప్పుకోమని అత్యాచారం చేశారు. యువకుడు కోర్టులో సివిల్ కేసు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జడ్జి కూడా ఈ విషయం విని కన్నీళ్లు పెట్టుకున్నారు.

దొంగతనం కేసు ఒప్పుకోవాలని పోలీసుల చిత్రహింసలు! యువకుడు చెప్తుంటే.. జడ్జి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు..
Bihar Case
SN Pasha
|

Updated on: May 03, 2025 | 4:08 PM

Share

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో మరోసారి పోలీసుల దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఓ యువకుడు కోర్టులో సివిల్ కేసు వేశాడు. పోలీసులు అతన్ని దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని, చేయని నేరం తనపైన వేసుకోమంటూ చిత్ర హింసలు పెట్టారు. నేను దొంగతనం చేయలేదు అని మొత్తుకుంటున్నా.. నువ్వే చేశావని ఒప్పుకో అంటూ యువకుడి చేతులు, కాళ్ళను తాడుతో కట్టి, కర్రతో అతని అరికాళ్ళపై ఆగకుండా 100 కంటే ఎక్కువ లాఠీలు విరిగిపోయేలా కొట్టారు. నేరం ఒప్పుకుంటూ సంతకం పెట్టాలని కూడా బలవంతం చేశారు. యువకుడి మాటలు విని జడ్జి కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో భాగల్పూర్ లోని సుల్తాన్గంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురు ASIలు, ఇతర పోలీసులపై కోర్టు చర్యలకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినోబా నగర్ నివాసి సంజయ్ చౌదరి కుమారుడు బాధితుడు రాహుల్ మాట్లాడుతూ.. తాను గతంలో సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని నిషేధ విభాగం LTF వాహనంలో డ్రైవర్‌గా పనిచేశానని చెప్పాడు. ఏప్రిల్ 25న వార్డు నంబర్ వన్‌లో నివసిస్తున్న డబ్ల్యూ రాజన్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. రాజాన్స్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో దొంగతనం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తాన్‌పూర్ పోలీసులు ఏప్రిల్ 29 రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రశ్నించే నెపంతో రాహుల్‌ను ఇంటి నుండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారు.

దొంగతనం ఒప్పుకునేలా బలవంతం చేస్తూ.. చేతులు, కాళ్ళను తాడుతో కట్టేసి ముగ్గురు ASIలు అతని అరికాళ్ళపై 100 కర్రలు విరిగేలా కొట్టారు. రోజంతా అతన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచిన తర్వాత, సాయంత్రం అతని నుండి పిఆర్ బాండ్ నింపమని బలవంతం చేసి పోలీసులు విడుదల చేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే అతని పరిస్థితి మరింత దిగజారింది. అతని ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు చూసి, అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందిన తర్వాత.. ఈ విషయంలో తాను పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, కానీ తన ఫిర్యాదు ఎక్కడా విచారణకు రాకపోవడంతో, బాధితుడు కోర్టులో సివిల్ దావా వేసినట్లు వెల్లడించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి