AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగతనం చేస్తూ.. 20 మంది పిల్లలకు స్కూల్‌, కాలేజీ ఫీజ్‌ కడుతున్నాడు! ఇతను చేస్తుంది తప్పా.. ఒప్పా?

ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, 260 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివు, తాను దొంగిలించిన డబ్బుతో 20 మంది పిల్లలకు పాఠశాల, కళాశాల ఫీజులు చెల్లించాడని తెలిసింది. అతని స్నేహితులు అనిల్, వివేక్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ చోరీ కేసులో బెంగళూరు పోలీసులకు మంచి విజయం లభించింది.

దొంగతనం చేస్తూ.. 20 మంది పిల్లలకు స్కూల్‌, కాలేజీ ఫీజ్‌ కడుతున్నాడు! ఇతను చేస్తుంది తప్పా.. ఒప్పా?
Accused Persons
SN Pasha
|

Updated on: May 20, 2025 | 5:35 PM

Share

బెంగళూరు పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్‌లో దొంగలను అరెస్టు చేశారు. వారిలో ఒకడు తాను దొంగిలించిన డబ్బుతో 20 మంది పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించాడు. ప్రస్తుతం బ్యాదరహళ్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బేగూర్ వాసి శివు అలియాస్ శివరప్పన్, అతని స్నేహితులు అనిల్ అలియాస్ జగ్గా, వివేక్‌లను అరెస్టు చేశారు. బేగూర్ నివాసి శివు అలియాస్ శివరప్పన్ ఈ కేసుకు ప్రధాన సూత్రధారి. భార్య లేదా పిల్లలు లేని శివ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలోని స్నేహితులు తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండటం అతను చూశాడు.

ఆ తర్వాత బ్యాదరహళ్లితో సహా అనేక ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలు చేశాడు. దొంగిలించిన బంగారు నగలను తన స్నేహితులు అనిల్ అలియాస్ జగ్గా, వివేక్ సహాయంతో అమ్మేశాడు. ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో 20 మంది పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు శివ తమిళనాడులో రూ.22 లక్షలకు బంగారాన్ని విక్రయించాడు. వచ్చిన డబ్బులో వివేక్ కు రూ.4 లక్షలు, అనిల్ కు రూ.4 లక్షలు వచ్చాయి. మిగిలిన 14 లక్షలతో ఆ ప్రాంతంలోని 20 మంది పిల్లల పాఠశాల, కళాశాల ఫీజులు చెల్లించాడు. దొంగలను వెంబడిస్తున్న బ్యాదరహళ్లి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు శివు, అనిల్, వివేక్ లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.24 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..