ఆటోమొబైల్ రంగానికి గుడ్న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ
ఆటోమొబైల్ రంగానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్న్యూస్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి వాహన పాలసీ రూపొందనుందని
Nitin Gadkari News: ఆటోమొబైల్ రంగానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్న్యూస్ చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి వాహన పాలసీ రూపొందనుందని గడ్కరీ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, వాహన పాలసీకి సంబంధించి చివరి దశలో ఉన్నామని తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాహన పాలసీపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాలు అన్నీ అధ్యయనం చేస్తున్నాయని నితిన్ వెల్లడించారు.
ఇక పాత వాహనాలను కొనడం వలన వాటిని రీసైక్లింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని, ముడి విభాగాల దిగుమతి తగ్గి ఖర్చు తగ్గుతుందని ఆయన వివరించారు. అంతేకాదు స్వదేశీ పరికరాలను ప్రోత్సహించేందుకు విదేశీ దిగుమతులపై అధిక పన్నులు విధించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే కీలక చర్యలు తీసుకుందని, ఎంఎస్ఎంఈలపై కేంద్రం ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని గడ్కరీ వివరించారు. కాగా వాహన పాలసీలో వినియోగదారులకు లాభం చేకూరనుంది. పాత వాహనాలను మార్చుకునే కస్టమర్లకు ఈ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read More:
విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు
బన్నీకి ‘రౌడీ’ స్పెషల్ గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్