AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం సీరియస్.. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 లక్షల చలాన్లు: నితిన్‌ గడ్కారీ

Nitin Gadkari: రోడ్డు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, నిబంధనలు మరింత కఠినతరం చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా..

Nitin Gadkari: ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం సీరియస్.. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 లక్షల చలాన్లు: నితిన్‌ గడ్కారీ
Nitin Gadkari
Subhash Goud
|

Updated on: Mar 24, 2022 | 5:03 PM

Share

Nitin Gadkari: రోడ్డు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, నిబంధనలు మరింత కఠినతరం చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ అన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ చలాన్ల (Traffic Challan)పై పార్లమెంట్‌లో మంత్రి మాట్లాడారు. రోడ్డు భద్రత (Road Safety) విషయంలో అవగాహన కల్పించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. పార్లమెంట్‌ ( Parliament)లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సుమారు 2 కోట్ల చలాన్లు జారీ చేయబడ్డాయి. వాటిపై సుమారు 1900 కోట్ల జరిమానా విధించినట్లు చెప్పారు. అదే సమయంలో, ఈ ఏడాది మార్చి 15, 2022 వరకు 40 లక్షల చలాన్లు జారీ చేశారు. రోడ్డు భద్రతపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే ఆయన పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నితిన్ గడ్కరీ సభకు తెలిపారు.

2021 సంవత్సరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1,898.73 కోట్ల విలువైన 1.98 కోట్ల చలాన్లు జారీ చేయబడ్డాయి. అదే సమయంలో 2021లో 2,15,328 రోడ్ రేజ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జనవరి 1 నుండి మార్చి 15, 2022 మధ్య 40 లక్షల చలాన్‌లను తగ్గించినట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. ఇందులో మొత్తం రూ.417 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ నుంచి నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను మెరుగుపరచడానికి మోటారు వాహన (సవరణ) బిల్లు, 2019ని ఆగస్టు 5, 2019న పార్లమెంట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి 9 ఆగస్టు 2019న బిల్లుకు ఆమోదం తెలిపారు.

నిబంధనలు మరిత కఠినతరం:

కొత్త చట్టంతో ట్రాఫిక్‌కు సంబంధించిన నిబంధనలు కఠినంగా మారాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలపై మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. మోటారు వాహనాల (సవరణ) చట్టం అమలుకు ముందు మోటారు వాహనాల చట్టం 1988 కింద ఫిబ్రవరి 1, 2017, ఆగస్టు 31, 2019 మధ్య నమోదైన కేసుల సంఖ్య 13,872,098 అని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే మోటారు వాహనాల (సవరణ) చట్టం అమలు తర్వాత, సెప్టెంబర్ 1, 2019, ఫిబ్రవరి 2022 మధ్య నమోదైన కేసుల సంఖ్య 48,518,314. దీనితో పాటు రోడ్డు భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ఇవి కూడా చదవండి:

LIC Policy Holders: ఎల్‌ఐసీలో అలాంటి పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 25 చివరి తేదీ

April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు