Assembly Election Exit Poll Results 2026 Live: తుది దశకు బెంగాలో రెండో దశ పోలింగ్.. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్
Assembly Election 2026 Exit Poll Results Live updates in Telugu: దేశంలోని ఐదురాష్ట్రాల ఎన్నికల తుది దశకు చేరుకున్నాయి. నేటితో బెంగాల్లో రెండో విడత పోలింగ్ కూడా ముగియనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగా.. తాజాగా ఇవాళ సాయంత్రం 6గంటలకు పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత 6:30 గంటల నుండి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతున్నాయి.

LIVE NEWS & UPDATES
-
The Battle for Bhabanipur: భవానిపూర్ పోరు: మమత వర్సెస్ సువేందు
బెంగాల్ రెండో విడత పోలింగ్లో అందరి దృష్టి కోల్కతాలోని భవానిపూర్ నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు పోటీ పడుతున్నారు. అయితే 2011 నుండి ఈ భవానిపూర్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఈ సారి సీఎం మమతా బెనర్జీ ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఎన్నికల్లో పోటీ పడడం ఇదే తొలిసారి ఏం కాదు. గత 2021 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ పోటీపడ్డారు.
-
రికార్డ్స్థాయిలో పశ్చిమ బెంగాల్ పోలింగ్
- కాసేపట్లో ముగియనున్న బెంగాల్ రెండోదశ ఎన్నికల పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో వేచివున్న వారందరికీ ఓటు వేసే అవకాశం.
- పలు పోలింగ్ కేంద్రాల ముందు క్యూలైన్లు
- తుది విడతలో మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
-
-
ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
బెంగాల్లో కొనసాగుతున్న రెండడో దశ పోలింగ్
తప ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్కతాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న దీదీ
ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మమత
కేంద్ర బలగాలు ఎన్ని కుట్రలు చేసినా విజయం తమదేనన్న సీఎం
-
West Bengal Election Voting: బెంగాల్ రెండో దశ పోలింగ్లో బంపర్ ఓటింగ్
బెంగాల్ రెండో దశ పోలింగ్లో బంపర్ ఓటింగ్
మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్
పలు చోట్ల TMC, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపణ
బీజేపీ గుర్తుపై టేప్ అతికించారన్న బీజేపీ నేతలు
టేప్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామన్న ఈసీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఉంది. బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొండి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్లో ఏప్రిల్ 23తొలి విడత జరగ్గా ఇవా రెండు విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండు విడతల్లోనే రాష్ట్రంలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. దీంతో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అటు దీదీ పట్టుదలతో ఉన్నారు.
తమిళనాడు: ఇక ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే తమిళానడు పోలింగ్ పూర్తైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 85 శాతం పైగా ఓటింగ్ నమోదైంది.అయితే ఈ సారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండగా ఈ సారి మాత్రం నటుడు విజయ్ టీవీకే ఎంట్రీలో మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.
ఇక కేరళా విషయానికి వస్తే ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 140 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగ్గా సుమారు 74 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ నేత విజయన్ ధీమాగా ఉండగా, ఈసారి మార్పు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అటు అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ, గౌరవ్ గొగొయ్ మధ్య ప్రచార పర్వం జోరుగా సాగింది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరిలో కూడా ఎన్డీయే, ఇండియా బ్లాక్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి. ఇక బెంగాల్లో రెండో విడత ఎన్నికలు ముగియగానే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
బెంగాల్లో తుది దశ పోలింగ్
అయితే బెంగాల్లో రెండో దశ పోలింగ్లో దాదాపు తుది దశకు చేరుకుంది. తొలి దశలో మాదిరి ఇప్పుడు కూడా బెంగాల్లో బంపర్ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్ నమోదయ్యింది.
అయితే ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ గుర్తుపై టేప్ అతికించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ టేప్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని , అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
అయితే ఈ పోలింగ్లో రాజకీయా నేతలు, సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తాను పోటీ చేస్తున్న భవానీపూర్లో ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం బలగాలు ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీదే గెలుపన్నారు. పోలింగ్ బూత్ దగ్గర విక్టరీ సంకేతాన్ని చూపించారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published On - Apr 29,2026 4:24 PM




