AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకి ఎంపీలు స్వాగతం పలికారు.

Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ
Chandrababu Delhi Tour
Balaraju Goud
|

Updated on: Nov 16, 2024 | 8:08 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకి ఎంపీలు స్వాగతం పలికారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న 15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతికి రుణాల ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మలకు విన్నవించుకున్నారు సీఎం. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు కలిసారు.

మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి జైశంకర్ వచ్చారు. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి జైశంకర్‌. అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ను భాగస్వామిగా.. పునరుద్ధరించాలని జైశంకర్‌ను కోరారు చంద్రబాబు. వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి-పెన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని సీఎం కోరినట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జై శంకర్‌తో చంద్రబాబు చర్చించారని తెలిపారు. మనవాళ్లు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. విదేశీ పెట్టుబడులు ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి జై శంకర్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు.

ఇక ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్‌ ప్లాలెస్‌లో జరిగే మీడియా కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మీడియా కాన్‌క్లేవ్ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్తారు చంద్రబాబు. 5.30గంటలకు థానే చేరుకుని మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. 17వ తారీఖు సాయంత్రం వరకూ ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేస్తారు చంద్రబాబు. అనంతరం మళ్లీ తిరిగి అమరావతి బయలు దేరుతారు ఏపీ సీఎం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ