AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రమాదానికి చేసిన కుట్ర భగ్నం.. ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు గుర్తించిన లోకో పైలట్‌..ఎక్కడంటే..

ఇదిలా ఉంటే, గత ఆగస్టు నెల నుంచి దేశవ్యాప్తంగా 18 సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు, టెలికాం స్తంభాలు, డిటోనేటర్లు వంటి వస్తువులు కనిపించాయని పేర్కొన్నారు. ఇది కేవలం రైల్వే శాఖకు మాత్రమే కాదు.. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసే అంశం

రైలు ప్రమాదానికి చేసిన కుట్ర భగ్నం.. ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు గుర్తించిన లోకో పైలట్‌..ఎక్కడంటే..
Missed Train Accident
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2024 | 12:35 PM

Share

లోకో పైలట్‌ అప్రమత్తతో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని భటిండాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డజను ఇనుప రాడ్‌లను పెట్టి వెళ్లారు. అయితే, రైలు లోకో పైలట్‌ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. ఈ ఇనుప రాడ్‌ల‌ను గ‌మ‌నించిన గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. వెంట‌నే సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బటిండా-ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా గూడ్స్ వెళ్తోంది. భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా ఒక గూడ్స్ రైలు ప్ర‌యాణిస్తోంది. అయితే ఎవ‌రో కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచి రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు దుండగులు. అయితే, రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ అందలేదు. దీంతో, ట్రైన్ చాలా ఆలస్యమైంది అని ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు. ట్రాక్ పై పెట్టిన ఇనుప రాడ్లను లోకో పైలెట్ ముందుగా గుర్తించి సకాలంలో బ్రేకులు వేసి ట్రైన్ ఆపాడు. దీంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. రైల్వే ట్రాక్‌పై ఐరన్‌ రాడ్లు ఉండడంతో రైలు ప్రమాదం తప్పినప్పటికీ, బటిండాకు వచ్చే గూడ్స్ రైలును 45 నిమిషాల పాటు నిలిపి వేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇదిలా ఉంటే, గత ఆగస్టు నెల నుంచి దేశవ్యాప్తంగా 18 సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు, టెలికాం స్తంభాలు, డిటోనేటర్లు వంటి వస్తువులు కనిపించాయని పేర్కొన్నారు. ఇది కేవలం రైల్వే శాఖకు మాత్రమే కాదు.. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసే అంశంగా వారు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో