AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishikesh: రిషికేశ్‌లోని ఈ ఆశ్రమంలో బస చేసిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఇక్కడ ఉచితంగా బస చేయవచ్చు.. ఎలాగంటే..

ముఖేష్ అంబానీ కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ ఇద్దరూ వారి భార్యలతో కలిసి ఉత్తరాఖండ్ లోని ప్రాముఖ్య ఆధ్యాత్మిక కేంద్రం రిషికేశ్ కి చేరుకున్నారు, ఈ సమయంలో సోదరులిద్దరూ కూడా పర్మార్త్ నికేతన్‌కు చేరుకుని గంగా ఆరతి, యాగంలో పాల్గొన్నారు. అయితే అపరకుబేరుల తనయులు బస చేసిన ఈ ఆశ్రమంలో, మీరు ఉచితంగా లేదా చౌక ధరకు గదిని బుక్ చేసుకోవచ్చని తెలుసా..

Rishikesh: రిషికేశ్‌లోని ఈ ఆశ్రమంలో బస చేసిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఇక్కడ ఉచితంగా బస చేయవచ్చు.. ఎలాగంటే..
Anant Ambani's Rishikesh Visit
Surya Kala
|

Updated on: May 05, 2025 | 3:33 PM

Share

భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అకస్మాత్తుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య రాధిక మర్చంట్, అన్నయ్య ఆకాష్, వదిన శ్లోక ఉన్నారు. అంబానీ కుటుంబం గంగా ఆరతికి హాజరై, పరమార్థ నికేతన్ ఆశ్రమంలో జరిగిన యాగంలో పాల్గొన్నారు. అంబానీ కుటుంబం స్వామి చిదానంద సరస్వతి నుంచి ఆశీర్వాదం తీసుకుంది. అయితే చిదానంద స్వామి సందర్శనను గోప్యంగా ఉంచారు.

మూలాల ప్రకారం అంబానీ కుటుంబం శనివారం మధ్యాహ్నం తెహ్రీ జిల్లాలోని బయాసిలోని తాజ్ హోటల్‌లో బస చేసింది. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ తమ భర్తలతో కలిసి పరమార్థ నికేతన్ చేరుకుని రెండు గంటల పాటు జరిగిన గంగా ఆరతిలో పాల్గొన్నాడు. ఆనందం , శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి యాగంలో కూడా పాల్గొన్నారు. అంబానీ కుటుంబం కూడా రిషికేశ్ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించింది.

ఆశ్రమంలో గదుల ధర ఎంత?

రిషికేశ్‌లోని పర్మార్త్ నికేతన్ ఆశ్రమంలో బస చేయడానికి చౌక ధరలకు గదులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ ఉచితంగా కూడా బస చేయవచ్చు. ప్రత్యేకించి మీరు స్వచ్ఛంద సేవకుడిగా పనిచేస్తే.. కొన్ని ఆశ్రమాలు రూ.50-100కి వసతిని కూడా అందిస్తాయి. మరికొన్ని గదులకు రాత్రికి రూ.350 వసూలు చేస్తాయి. ఈ ఆశ్రమం రామ్ ఝూలా సమీపంలోని మెయిన్ మార్కెట్ రోడ్డులో ఉంది. రూమ్ బుకింగ్ కోసం మీరు వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుంచి కూడా సహాయం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆశ్రమంలో సౌకర్యాలు ఏమిటి?

పరమార్థ నికేతన్ రిషికేశ్ ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది స్వామి చిదానంద సరస్వతి అధ్యక్షతన నడుస్తుంది. గంగా నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మీరు యోగా, ధ్యానం, రోజువారీ సత్సంగ్, కీర్తన, ఆయుర్వేద చికిత్స, గంగా ఆరతిలో కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ మీకు తక్కువ ధరలలో ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి