IND vs ENG Playing XI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ సెంటిమెంట్ రిపీటైతే కష్టమే?
ICC T20 World Cup India vs England Playing XI: టీ20 ప్రపంచ కప్లో రెండవ సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

IND vs ENG Playing XI: టీ20 ప్రపంచ కప్లో రెండవ సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇంగ్లాండ్ రెహాన్ అహ్మద్ స్థానంలో జామీ ఓవర్టన్ను చేర్చుకుంది.
ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. గతంలో 2022, 2024లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్ను గెలుచుకున్నాయి.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
