Toolkit Case: లక్ష రూపాయల పూచీకత్తుపై యాక్టివిస్ట్ దిశారవికి బెయిల్ మంజూరు, ఢిల్లీ కోర్టు తీర్పు.

Toolkit Case: టూల్ కిట్ కేసులో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది

Toolkit Case: లక్ష రూపాయల పూచీకత్తుపై యాక్టివిస్ట్ దిశారవికి బెయిల్ మంజూరు, ఢిల్లీ కోర్టు తీర్పు.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 4:45 PM

Toolkit Case: టూల్ కిట్ కేసులో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్.. పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ద్వారా ఆమె భారత వ్యతిరేక ప్రచారానికి పూనుకొందని  ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈమెతో బాటు నిఖితా జాకబ్, శంతను ములుక్ అనే వారిపై కూడా వారు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో  శంతను, నిఖితలకుకోర్టు నుంచి ముందే ట్రాన్సిట్ బెయిల్ లభించింది.  ఇలా ఉండగా టూల్ కిట్ కేసులో పోలీసుల తీరుపై ఢిల్లీ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం గమనార్హం. దిశారవికి, జనవరి 26 న ఢిల్లీలో జరిగిన ఘటనలకు సంబంధం ఉందనడానికి మీరు సేకరించిన ఆధారాలేమిటని కోర్టు వారిని ప్రశ్నించింది. అసలు టూల్ కిట్ అంటే ఏమిటని కూడా జడ్జి ప్రశ్నించారు. ఈ కేసులో వారు సమర్పించిన ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా-తన క్లయింటు దిశారవి కుటుంబం లక్ష రూపాయల బెయిల్ బాండ్ సమర్పించజాలదని, ఇది చాలా ఎక్కువ అని ఆమె లాయర్ కోర్టుకు తెలిపారు. మొదట దిశను కోర్టు గదికి తీసుకువస్తుండగా తన బంధువులను చూసి ఆమె ఉద్వేగంతో కంట తడి పెట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దిశా కస్టడీని మరో నాలుగురోజులపాటు పొడిగించాలని పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమె కస్టడీని మరో 24 గంటలు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. మంగళ వారం  ఉదయం దిశతో బాటు శంతను ములుక్, నిఖితా జాకబ్ లను కూడా పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా దిశ.. వీరిద్దరిపై ఆరోపణలు చేసిందని, అందువల్ల ఆమె బెయిలును నిరాకరించాలని పోలీసులు కోర్టును కోరారు.

Also Read:

Elon Musk : ఒక్క ట్వీట్ తో 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్

రేపు తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నకేటీఆర్‌

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు