AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌ స్మగ్లింగ్‌లో దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రం.. 2022లో 3500 కిలోల బంగారం సీజ్‌..

గతంలో సింగపూర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు 3.3 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

గోల్డ్‌ స్మగ్లింగ్‌లో దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రం.. 2022లో 3500 కిలోల బంగారం సీజ్‌..
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 20, 2023 | 5:18 PM

2022లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 3,502 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది 2021 సంవత్సరం కంటే 47% ఎక్కువ అని ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. దీనికి సంబంధించి మొత్తం 3,982 కేసులు నమోదు కాగా, కేరళలో 755.81 కిలోలు, మహారాష్ట్రలో 535.65 కిలోలు, తమిళనాడులో 519 కిలోలు, బంగారం పట్టుబడిన మొదటి 3 రాష్ట్రాలు ఇవే.. 2020లో 2,154 కిలోలు, 2021లో 2,383 కిలోల స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

కొద్ది రోజుల క్రితం, బంగారం స్మగ్లింగ్ ఆరోపణపై కస్టమ్స్ అధికారులు కొచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని అరెస్టు చేశారు. వాయనాడ్‌కు చెందిన షఫీ, తన చేతులకు బంగారం అతికించుకుని గమ్ టేప్‌తో కప్పి, పొడుగు చేతుల చొక్కా ధరించి ఉండగా ఎయిర్ ఇండియా సిబ్బంది అరెస్టు చేశారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న 1,487 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బహ్రెయిన్ నుంచి కోజికోడ్-కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న షఫీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ కు రహస్య సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీల్లో బంగారం బయటపడింది. నిందితుడు చేతికి బంగారాన్ని చుట్టి నిండు చేతుల చొక్కా ధరించి గమ్ టేపుతో దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. గతంలో సింగపూర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు 3.3 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

అతను సింగపూర్ నుండి చెన్నైకి ఎయిర్ ఇండియా AI-347 మరియు 6E-52లో వచ్చాడు. ఈ మేరకు చెన్నై కస్టమ్స్‌ ట్వీట్‌ చేసింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సమాచారం ఆధారంగా, 07.03.23న AI-347 మరియు 6E-52 ద్వారా సింగపూర్ నుండి 2 మంది ప్రయాణికులను కస్టమ్స్ అడ్డగించింది. సీఏ 1962 చట్టం కింద సీజ్ చేసిన అతని లగేజీలో రూ.3.32 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారం దొరికింది. అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..