Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: పైశాచికం.. సహజీవనం చేస్తున్న మహిళను చంపి.. డెడ్ బాడీని బెడ్ కబోర్డ్ లో పెట్టి..

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య ఘటనను మరవకుముందే.. దేశంలో ఎక్కడో ఓ చోట అలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పాల్ఘర్..

Mumbai: పైశాచికం.. సహజీవనం చేస్తున్న మహిళను చంపి.. డెడ్ బాడీని బెడ్ కబోర్డ్ లో పెట్టి..
Representative Image
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 15, 2023 | 1:06 PM

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య ఘటనను మరవకుముందే.. దేశంలో ఎక్కడో ఓ చోట అలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పాల్ఘర్ జిల్లాకు చెందిన మేఘ అనే 37 ఏళ్ల మహిళ ముంబయి లో నివాసం ఉంటూ హార్దిక్ తో లైవ్ ఇన్ రిలేషన్ లో ఉంది. హార్దిక్ నిరుద్యోగి కాగా.. మేఘ నర్సుగా పని చేస్తోంది. కొన్నాళ్లు బాగానే ఉన్న తరువాత.. వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్ మేఘాను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత హార్దిక్ ఇంట్లోని కొన్ని వస్తువులను విక్రయించి ఆ డబ్బుతో పరారయ్యాడు. మృతదేహాన్ని బెడ్ కబోర్డ్ లో పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసుులు.. రైలు ట్రాకర్ సహాయంతో మధ్యప్రదేశ్‌లోని నాగ్డాలో హార్దిక్ ను అరెస్టు చేశారు.

కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లోని మిత్రన్ గ్రామ శివార్లలో తాను డేటింగ్ చేస్తున్న యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచాడనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని సాహిల్ గెహ్లాట్ గా గుర్తించారు. పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేసి దాబాలోని ఫ్రిజ్‌ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు సాహిల్ తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు కోపంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం