అమెరికాలో అక్షర్‌ధామ్‌ మహామందిర్ ప్రారంభోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ, రిషి సునాక్..

భారత్‌ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం కానుంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు సెప్టెంబర్ 30 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామినారాయణ్ అక్షరధామ్‌‌ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది.

అమెరికాలో అక్షర్‌ధామ్‌ మహామందిర్ ప్రారంభోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ, రిషి సునాక్..
PM Modi, Rishi Sunak
Follow us

|

Updated on: Oct 02, 2023 | 11:40 AM

భారత్‌ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం కానుంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు సెప్టెంబర్ 30 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామినారాయణ్ అక్షరధామ్‌‌ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది. ఈ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన వేడుకలు 9 రోజులపాటు పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అమెరికాలో అక్షర్‌ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాధినేతలతోపాటు.. నలువైపుల నుంచి ప్రముఖులు బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ట్రస్టుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు.. మద్దతును అందిస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్.. ఇది ఒక సాంస్కృతిక మైలురాయి.. అంటూ బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ట్రస్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ సాంస్కృతిక మైలురాయిగా నిలిచిపోవడంతోపాటు.. ట్రస్టు ప్రాముఖ్యతను ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా, BAPS స్వామినారాయణ్ అక్షరధామ్‌లు హిందూ కళ, వాస్తుశిల్పం, సంస్కృతికి మైలురాయిగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, సమాజ కేంద్రాలుగా పనిచేస్తూ.. అన్ని విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. న్యూజెర్సీలోని అక్షరధామ్ ప్రపంచవ్యాప్తంగా మూడవ సాంస్కృతిక సముదాయంగా నిలువనుంది. మొదటి అక్షరధామ్ 1992లో భారతదేశంలోని గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్మించారు. 2005లో న్యూ ఢిల్లీలో రెండవ అక్షరధామ్ నిర్మాణం జరిగింది. BAPS స్వామినారాయణ్ అక్షరధామ్, బహుశా ఆధునిక యుగంలో చేతితో చెక్కబడిన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పవచ్చు.

Pm Modi

PM Modi

దేశాధినేతల ప్రశంసలు..

బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ సముదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులందరి ప్రశంసలను పొందాయి.. రాష్ట్రపతి బిల్ క్లింటన్ (గాంధీనగర్, 2001), రాష్ట్రపతి A. P. J. అబ్దుల్ కలాం (న్యూ ఢిల్లీ, 2005), మెజెస్టి కింగ్ చార్లెస్ III (న్యూ ఢిల్లీ, 2013), ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో (న్యూ ఢిల్లీ, 2020), హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (న్యూ ఢిల్లీ, 2023), రిషి సునాక్ (న్యూ ఢిల్లీ, 2023), ఇలా ఎందరో దేశాధినేతలు అక్షర్‌ధామ్‌ సేవలను కొనియాడారు.

శుభప్రదం.. ప్రధాని మోడీ..

అయితే, న్యూజెర్సీలో అక్షరధామ్ ప్రారంభ వేడుకలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “అక్షరధామ్ మహామందిర్ ప్రారంభ వేడుకల గురించి తెలుసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు నిదర్శనం.. స్వామి నారాయణుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు.” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్షరధామ్ కాంప్లెక్స్‌లను ప్రశంసించారు. 2017లో గాంధీనగర్‌లోని అక్షరధామ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అప్పట్లో మోడీ సందర్శించి నిస్వార్థ సేవ చేస్తున్న పవిత్ర ప్రముఖ్ స్వామి మహారాజ్ నాయకత్వాన్ని అభినందించారు. స్వామి నారాయణ్ భక్తుల వాలంటీర్ల సేవ, BAPS నిర్వహించే మానవతా సహాయ కార్యక్రమాలు.. అక్షరధామ్ వెలువరించే శాంతి, సానుకూలతను ప్రధాని మోదీ ప్రశంసించారు. “అక్షర్‌ధామ్ దేవాలయాలు శతాబ్దాలుగా సేవా, సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. భక్తి కేంద్రాలు మాత్రమే కాకుండా కళ, వాస్తుశిల్పానికి వేదికలుగా కూడా ఉన్నాయి. శ్రేష్ఠత, సాహిత్యం, జ్ఞానం.. ఇటువంటి లోతైన సాంస్కృతిక సూత్రాలు మానవాళికి మార్గదర్శకంగా ఉన్నాయి. అక్షరధామ్ మహామందిర్ ప్రారంభ వేడుకలు భారతీయతను ప్రదర్శిస్తాయి. నిర్మాణ నైపుణ్యం, మన అద్భుతమైన ప్రాచీన సంస్కృతి, నీతి.. దీని ప్రారంభోత్సవంతో మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రయత్నం శుభప్రదం.. BAPS స్వామినారాయణ సంస్థ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు.. అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్..

సెప్టెంబరు 2023లో భారత్ వేదికగా జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ కు హాజరైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. “ఈ ఆలయ సౌందర్యం, దాని విశ్వవ్యాప్త శాంతి సందేశం చూసి మేము ఆశ్చర్యపోయాము.. సామరస్యం, మంచి మానవుడిగా మారేందుకు ఇది మంచి ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.. చరిత్రకు మైలురాయి.. భారతదేశ విలువలు, సంస్కృతి, ప్రపంచానికి అందించిన సేవలను కూడా చూపిస్తుంది..’’ అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా BAPS ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ నుంచి ప్రధాన మంత్రి రిషి సునక్ ఆశీస్సులు పొందారు. అంతేకాకుండా, యూఎస్ లో పవిత్రమైన మరో అందమైన స్వామినారాయణ అక్షరధామ్ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా రిషి సునాక్.. బాప్స్ సంస్థ, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

NJలోని రాబిన్స్‌విల్లేలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అక్షరధామ్ ప్రతిష్టాపన వేడుక ప్రారంభమైంది. అక్టోబర్ 8వ తేదీన ప్రారంబించనున్నారు. 12 సంవత్సరాలకు పైగా దీనిని నిర్మించారు. 12,500 మంది వాలంటీర్లు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఉత్తర అమెరికా అంతటా ఈ రాతి మహామందిర్ అక్షరధామ్‌ కేంద్రబిందువుగా మారనుంది. అద్భుతమైన నైపుణ్యాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించిన ఈ ఆలయంలో కళాత్మకతను కూడా మిళితం చేస్తుంది. ఆధ్యాత్మికత, సామరస్యం, శాంతికి దీటుగా ఈ అక్షరధామ్ ప్రపంచ ఆకర్షణగా నిలిచిపోనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం